భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినా.. ఇతర దేశాల్లో మళ్లీ భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో.. థర్డ్ వేవ్ తప్పదా? అనే ఆందోళనకు నెలకొన్నాయి.. ఓవైపు కోవిడ్ పోయిందనే భావనతో నిబంధనలు సడలిస్తూ వస్తున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతుందేమోన్న టెన్షన్ వెంటాడుతోంది. ఇక, కరోనా బారినపడుతున్నవారిలో యువతే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 20 ఏళ్లలోపు యువతే 90,561 మంది ఉన్నారని పేర్కొంది. పదేళ్లలోపు పిల్లలు 19,445 మంది కోవిడ్ బారినపడినట్టు వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు, మృతులపై వయసుల వారీగా నివేదిక రూపొందించింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో 61.4 శాతం మంది పురుషులు కాగా.. 38.6 శాతం మంది మహిళలు ఉన్నట్టు పేర్కొంది. ఇక, 31-40 ఏళ్ల బాధితులు 21.8 శాతం మంది.. అందులో 14.3 శాతం మంది పురుషులు, 7.5 శాతం మంది మహిళలు ఉండగా.. 41-50 ఏళ్ల మధ్య వయస్కులు 17.5 శాతం, 51-60 ఏళ్ల వారు 14.4, 61-70 ఏళ్ల మధ్య ఏజ్వారు 7.7, 71-80 ఏళ్ల వారు 2.7, 81 ఏళ్లు పైబడినవారు 0.7 శాతం మంది కోవిడ్ బారినపడినట్టు నివేదికలో పేర్కొంది వైద్యశాఖ.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్తో మరణించిన వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 55.69 శాతం మంది ఉన్నారని ఆ నివేదికలో వెల్లడించారు.. ఇక, తాజా బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,829కి పెరగగా.. మృతుల సంఖ్య 3,951గా ఉంది.. ఇప్పటి వరకు నిర్వహంచిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,74,30,113కు పెరిగింది.