Jaggareddy: బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీలు చూస్తే సినిమాలు చూడాల్సిన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaggareddy: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి సంచలనంగా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని అన్నారు. బీజేపీ..టీఆర్ఎస్ రాజకీయ పార్టీలుగా కాకుండా కార్పొరేటర్ వ్యవస్థగా పమి చేస్తున్నాయని ఆరోపించారు. మోడీ ఈ ఎనిమిది ఏండ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేవు.. పెట్రో ధరలు పెరిగాయి.. గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ రెండు లక్షల ఉద్యోగాలు దిక్కు లేదని ఆరోపించారు. లక్ష రుణమాఫీ లేదు, 57 ఏండ్ల వాళ్లకు పెన్షన్ అన్నారు అది లేదని అన్నారు. బీజేపీ..టీఆర్ఎస్ మీడియా ఎట్రాక్ట్ ఎలా చేయాలని చూస్తున్నారని అన్నారు. మీడియా ని డైవర్ట్ చేయడం ఎలా అనే దానిలోని ఉన్నాయని ఆరోపించారు.
Read also: Safest investment Plan: సురక్షితమైన పెట్టుబడికి సరైన మార్గం విజయవాడ హైవే
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
బీజేపీ..టీఆర్ఎస్ ఇద్దరు హోంశాఖను పెట్టుకుని పొలిటికల్ డ్రామా కంపనీ నడిపిస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని ఇద్దరు ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు పోటీ పడి ప్రజలకు మేలు చేస్తున్నారా అంటే అది లేదన్నారు. చెండాలమైన రాజకీయం చేస్తున్నాయి బీజేపీ..టీఆర్ఎస్ పార్టీలని అన్నారు. విభజన జరిగితే ఎదో అయిపోతుంది అని కలలు కన్నారు విద్యార్థులు అని ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్ర పాలన చేస్తున్నాయి టీఆర్ఎస్.. బీజేపీలు అంటూ నిప్పులు చెరిగారు. రైతుల సంగతి అడిగే వాళ్ళే లేరని అన్నారు. ఒకరిని ఒకరు గిచ్చుకుంటున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీ..టీఆర్ఎస్ తిట్టుకునుడు.. కొట్టుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి..? అని ప్రశ్నించారు. సొంత పంచాయతీలు రెక్కువ అయ్యాయి.. రెండు పార్టీలకు అంటూమండిపడ్డారు. బీజేపీ..టీఆర్ఎస్ పంచాయతీలు చూస్తే చాలు.. సినిమాలు చూడాల్సిన అవసరం లేదన్నారు. కవిత..అరవింద్ లు రైతుల కోసం కొట్లాడుతున్నారా? విద్యార్థల కోసం కొట్లాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ప్రజల సమస్యలు వదిలేసి.. సొంత దుకాణాలు పెట్టారని ఎద్దేవ చేశారు.
Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!