Jaggareddy: బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీలు చూస్తే సినిమాలు చూడాల్సిన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaggareddy: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి సంచలనంగా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని అన్నారు. బీజేపీ..టీఆర్ఎస్ రాజకీయ పార్టీలుగా కాకుండా కార్పొరేటర్ వ్యవస్థగా పమి చేస్తున్నాయని ఆరోపించారు. మోడీ ఈ ఎనిమిది ఏండ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేవు.. పెట్రో ధరలు పెరిగాయి.. గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ రెండు లక్షల ఉద్యోగాలు దిక్కు లేదని ఆరోపించారు. లక్ష రుణమాఫీ లేదు, 57 ఏండ్ల వాళ్లకు పెన్షన్ అన్నారు అది లేదని అన్నారు. బీజేపీ..టీఆర్ఎస్ మీడియా ఎట్రాక్ట్ ఎలా చేయాలని చూస్తున్నారని అన్నారు. మీడియా ని డైవర్ట్ చేయడం ఎలా అనే దానిలోని ఉన్నాయని ఆరోపించారు.
Read also: Safest investment Plan: సురక్షితమైన పెట్టుబడికి సరైన మార్గం విజయవాడ హైవే
Also Read
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
- CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
- CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
- Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
బీజేపీ..టీఆర్ఎస్ ఇద్దరు హోంశాఖను పెట్టుకుని పొలిటికల్ డ్రామా కంపనీ నడిపిస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని ఇద్దరు ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు పోటీ పడి ప్రజలకు మేలు చేస్తున్నారా అంటే అది లేదన్నారు. చెండాలమైన రాజకీయం చేస్తున్నాయి బీజేపీ..టీఆర్ఎస్ పార్టీలని అన్నారు. విభజన జరిగితే ఎదో అయిపోతుంది అని కలలు కన్నారు విద్యార్థులు అని ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్ర పాలన చేస్తున్నాయి టీఆర్ఎస్.. బీజేపీలు అంటూ నిప్పులు చెరిగారు. రైతుల సంగతి అడిగే వాళ్ళే లేరని అన్నారు. ఒకరిని ఒకరు గిచ్చుకుంటున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీ..టీఆర్ఎస్ తిట్టుకునుడు.. కొట్టుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి..? అని ప్రశ్నించారు. సొంత పంచాయతీలు రెక్కువ అయ్యాయి.. రెండు పార్టీలకు అంటూమండిపడ్డారు. బీజేపీ..టీఆర్ఎస్ పంచాయతీలు చూస్తే చాలు.. సినిమాలు చూడాల్సిన అవసరం లేదన్నారు. కవిత..అరవింద్ లు రైతుల కోసం కొట్లాడుతున్నారా? విద్యార్థల కోసం కొట్లాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ప్రజల సమస్యలు వదిలేసి.. సొంత దుకాణాలు పెట్టారని ఎద్దేవ చేశారు.
Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల
తాజావార్తలు
-
TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్… ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
-
Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
-
Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!