హుజురాబాద్.. టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతలు తిష్టవేసి పావులు కదుపుతున్నారు.. ఈ సమయంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు ముద్దసాని కశ్యప్ రెడ్డి.. ఇవాళ గులాబీ పార్టీ గూటికి చేరారు.. ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆయనకు పేరుంది… వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన కశ్యప్ రెడ్డి.. కాసేపటి క్రితం.. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని.. తెలంగాణ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుంది.. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు.. త్వరలో హూజూరాబాద్ లో జరిగే మీటింగ్లో వందలాది మంది కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరతారని.. వచ్చే ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా అఖండ విజయం సాధించేందుకు అంకితభావంతో ముందుకు సాగుతామని వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!