CM Revanth Reddy : త్వరలోనే కొడంగల్ లో సిమెంట్ ఫ్యాక్టరీ
- 5 వేల కోట్లతో మక్తల్ -నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం
- మూడేళ్లలో కొడంగల్ అన్ని మూలాల భూములు తడుపుతాం
- లగచర్ల లో కుట్ర చేసి, అమాయక రైతులను రెచ్చగొడితే వాళ్ళు కేసుల్లో ఇరుకున్నారు
- అడిగినంత భూ పరిహారం ఇస్తామని చెప్పాము : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : వికారాబాద్ జిల్లా కొడంగల్లోని ఎన్కేపల్లి రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేస్తూ, ముందున్న పది సంవత్సరాలు ‘ఇందిరమ్మ రాజ్యం’గా నిలుస్తాయని సీఎం ప్రకటించారు. అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా కొనసాగిద్దామని ప్రజలను పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రూ. 5 వేల కోట్లతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ప్రభుత్వం చేపట్టిందని, దీని ద్వారా వచ్చే మూడు సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మూలాల భూములకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లగచర్లలో జరిగిన ఉద్రిక్తతలు, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు దురుద్దేశపూరితమని విమర్శిస్తూ, అడిగినంత భూ పరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
లగచర్ల, హకింపేట ప్రాంతాల్లో 3 నుండి 4 వేల ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించేలా లగచర్ల పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామని చెప్పారు. “తెలంగాణకు నోయిడా మాదిరిగా లగచర్లకు ప్రత్యేక గుర్తింపు తెస్తాం” అని స్పష్టం చేశారు. కొడంగల్లో రైల్వే ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమవుతుందని, ఎన్నో దశాబ్దాల కల ఇలా నెరవేరబోతోందని అత్యంత ఆత్మవిశ్వాసంతో చెప్పారు. కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు కూడా త్వరలో ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నాణ్యత కలిగిన చీరల పంపిణీ జరుగుతోందని, అధికారులు ఇంటింటికి వెళ్లి వాటిని అందించాలని సూచించారు. ప్రజలు ఆ చీరలను ధరించి ఎన్నికల రోజున ప్రభుత్వం చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. గతంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం చూపారని, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఆడబిడ్డలు, మహిళలు జారవిడవకూడదని ఆయన పిలుపునిచ్చారు. కొడంగల్ అభివృద్ధి కొత్త దిశలో సాగేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి ప్రజలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!