CM Revanth Reddy : కాలు విరిగినది అని సభకు రాలేదు.. కానీ నల్గొండకు పోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడిగడ్డ ప్రాజక్ట్ను పరిశీలించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు విరిగినది అని సభకు రాలేదని, కానీ నల్గొండకు పోయాడంటూ విమర్శలు గుప్పించారు. కాలు విరిగిన కేసీఆర్ కి అసెంబ్లీ దగ్గరా… నల్గొండ దగ్గరా..? అని ఆయన అన్నారు. నల్గొండ దాకా పోయిన నువ్వు.. అసెంబ్లీ కి ఎందుకు రావు అని ఆయన ప్రశ్నించారు. నాలుగు పిల్లర్లు కూలితే తప్పా అంటున్నాడు కేసీఆర్ అని, నీ తప్పులకు నువ్వు శిక్ష వేసుకునే అంతటి వాడివి కాదు అని తెలుసు అని అన్నారు. కేసీఆర్ మేడిగడ్డని చులకన చేస్తున్నాడని, శాసన సభలోనే krmb మీద సలహాలు ఇవ్వండి అనే సభ పెట్టినమన్నారు. నువ్వు కూడా వచ్చి ఇవ్వాల్సిందన్నారు. మా తీర్మానం సక్కగా లేకుంటే.. మీ స్వాతిముత్యం అల్లుడు ఎందుకు చెప్పలేదని ఆయన వెల్లడించారు. సభలో నేను అప్పుడే చెప్పిన..హరీష్ మాటకు విలువ లేదు అని, సరిగ్గా కేసీఆర్ కూడా అదే అన్నాడన్నారు. హరీష్ లాంటోళ్లకు brs లో విలువ లేదు అని నిరూపితం అయ్యిందని, సభకు వచ్చి అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోంది అని ప్రతిపాదన పెట్టు అని ఆయన అన్నారు. మేము సలహా తీసుకుంటామన్నారు. కేసీఆర్.. బెదిరించి బతకాలని చూస్తున్నాడని, నువ్వు వెంటాడితే.. మేము అల్లాటప్పగా కుర్చీ ఎక్కలేదు.. మంది పిల్లల ప్రాణాల మీద అధికారంలోకి నీలగా రాలేదన్నారు.
INDIA bloc: ఢిల్లీలో ఒకటి మీకు, గుజరాత్లో 8 మాకు.. ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ..
అంతేకాకుండా..’కాళేశ్వరం అవినీతిలో నీకు సంబంధం లేకుంటే. ఎందుకు సభకు రావడం లేదు. అన్నారం మీద..మేడిగడ్డ పై ఎందుకు నోరు మెదపలేదు. అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకు సభలు పెట్టుకున్నాడు. ప్రతిపక్ష హోదా ఇచ్చారు జనం. సభకు రాకుండా ఎక్కడ పోతావు కేసీఆర్. సభకు రాకుండా పారిపోయింది మీరు. కేసీఆర్ కి కుర్చీ పోగానే.. ఫ్లోరైడ్.. గుర్తుకు వచ్చింది.. నీళ్లు గుర్తుకు వచ్చింది ఆయనకు.. కేసీఆర్ నువ్వు సభకు రా.. నీ గౌరవం తగ్గించము.. మీరు ఏ సూచన ఇచ్చినా స్వీకరిస్తాం.. శ్వేతపత్రం ప్రవేశ పెడతాం రండి సలహా.. సూచన ఇవ్వండి. Krmb కి ప్రాజెక్టు లు ఇచ్చే క్రమంలో.. ఏనుగు పోయింది తోక మిగిలింది. ఏనుగు ను ముంచింది మీరు.. తోక అయినా పట్టుకుని కాపాడాలని మేము చూస్తున్నాం. అది కూడా వద్దు అన్నట్టు కేసీఆర్ వ్యవహారం. మేడిగడ్డ 5 ఫీట్లు కుంగిపోయింది. నీళ్లు నింపితే.. ప్రమాదం.. చిన్న తప్పు అన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. L&T బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా. మేడిగడ్డ కుంగిపోయింది.. దాని మీద ని పార్టీ స్టాండ్ ఏంది..? సభకు వచ్చి చెప్పు.. కేసీఆర్ కుర్చీ పోయింది అని వెతుక్కుంటూ నల్గొండ పోయిండు.. పార్లమెంట్ సీట్లలో గెలవాలని సానుభూతి కోసం కేసీఆర్ ఎత్తుగడ.. నల్గొండ ప్రజలు నిన్ను క్షమించరు.. వీల్ చైర్ కి వచ్చిండు కేసీఆర్. సానుభూతి కోసం.. పచ్చిగా పట్టుబడి.. భయపడ అంటున్నాడు కేసీఆర్.. ఎవడు భయపడుతున్నాడు.. రా సభకు..భయపడక పోతే.. స్పీకర్ కూడా మీకు ఫుల్ మైక్ ఇత్తరు రా’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
CM Revanth Reddy : కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!