Ambulances: 466 అత్యవసర సేవల వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR launched 466 emergency service vehicles: తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్లో 108 అంబులెన్స్లు, అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. 204 కొత్త 108 అంబులెన్స్లు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో ఈ వాహనాలను కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 75 వేలకు ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. 2014లో 321 అంబులెన్స్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 455కి చేరుకుంది. 108 అత్యవసర అంబులెన్స్ ప్రతిస్పందన సమయం 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గింది. ప్రత్యేక అత్యవసర 108 అంబులెన్స్లు 2014లో లేవు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 108 ప్రత్యేక అంబులెన్స్లను అందించింది.
Read also: HYD ED Raids: హైద్రాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. రంగంలోకి 15 బృందాలు
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
నవజాత శిశువులకు జిల్లాకు ఒకటి చొప్పున అంబులెన్స్లను ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్క అంబులెన్స్ కూడా ఉండేది కాదు. GPS మరియు MDT ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ఈ అంబులెన్స్ ద్వారా ప్రతిరోజూ 2 వేల ఎమర్జెన్సీ కేసులకు సేవలు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 44 లక్షల 60 వేల మందికి సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో అమ్మఒడి వాహనాలు లేవు. కేసీఆర్ కిట్లో భాగంగా ప్రభుత్వం 300 వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు ఈ అంబులెన్స్ సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 30 లక్షల మంది గర్భిణులకు సేవలందించారు. తెలంగాణలో పరమపద వాహనాలు అందుబాటులో లేవు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 50 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు సగటున 35 మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 74 వేల మరణాలకు సేవలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Skanda: ఇద్దరు టెర్రిఫిక్ డాన్సర్లు చిందేస్తే… తెర చిరిగిపోద్ది
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!