Ambulances: 466 అత్యవసర సేవల వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR launched 466 emergency service vehicles: తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్లో 108 అంబులెన్స్లు, అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. 204 కొత్త 108 అంబులెన్స్లు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో ఈ వాహనాలను కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 75 వేలకు ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. 2014లో 321 అంబులెన్స్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 455కి చేరుకుంది. 108 అత్యవసర అంబులెన్స్ ప్రతిస్పందన సమయం 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గింది. ప్రత్యేక అత్యవసర 108 అంబులెన్స్లు 2014లో లేవు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 108 ప్రత్యేక అంబులెన్స్లను అందించింది.
Read also: HYD ED Raids: హైద్రాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. రంగంలోకి 15 బృందాలు
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
నవజాత శిశువులకు జిల్లాకు ఒకటి చొప్పున అంబులెన్స్లను ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్క అంబులెన్స్ కూడా ఉండేది కాదు. GPS మరియు MDT ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ఈ అంబులెన్స్ ద్వారా ప్రతిరోజూ 2 వేల ఎమర్జెన్సీ కేసులకు సేవలు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 44 లక్షల 60 వేల మందికి సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో అమ్మఒడి వాహనాలు లేవు. కేసీఆర్ కిట్లో భాగంగా ప్రభుత్వం 300 వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు ఈ అంబులెన్స్ సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 30 లక్షల మంది గర్భిణులకు సేవలందించారు. తెలంగాణలో పరమపద వాహనాలు అందుబాటులో లేవు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 50 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు సగటున 35 మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 74 వేల మరణాలకు సేవలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Skanda: ఇద్దరు టెర్రిఫిక్ డాన్సర్లు చిందేస్తే… తెర చిరిగిపోద్ది
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!