HYD ED Raids: హైద్రాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. రంగంలోకి 15 బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD ED Raids: హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలు రంగంలోకి దిగి ఏకకాలంలో వివిధ కంపెనీలు, యజమానుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాయి. పంజాగుట్ట, మణికొండ, జూబ్లీహిల్స్లోని పలు ఇళ్లు, సంస్థల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారవేత్త మలినేని సాంబశివరావు ఇళ్లు, సంస్థలపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ ట్రై రోడ్స్, టెక్నో యూనిట్ ఇన్ ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్ కంపెనీలకు ఆయన డైరెక్టర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఈడీ గుర్తించింది.
Read also: Whatsapp Settings: ఇలా చేయండి.. ఫేక్ కాల్స్, మెసెజెస్కు చెక్ పెట్టండి
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
అందులో భాగంగానే ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాలు, కంపెనీలకు సంబంధించిన పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణలపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నర్సరావుపేటకు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, సంస్థలపై కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరులోని ఆయన ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాయపాటి సాంబశివరావు హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఉంటున్నారు. రాయపాటి కుమారుడు రంగారావును ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాయపాటి కంపెనీలు రూ. వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి వాటిని చెల్లించలేదు. దీంతో ఈడీ గతంలో రాయపాటి సాంబశివరావుపై కూడా కేసు నమోదు చేసింది. అతని కంపెనీల్లో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది.
Whatsapp Settings: ఇలా చేయండి.. ఫేక్ కాల్స్, మెసెజెస్కు చెక్ పెట్టండి
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!