Vivek Venkataswamy: తుగ్లక్ నిర్ణయాలతో.. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Destroyed Telangana With Tuglak Decisions Says Vivek Venkataswamy: తెలంగాణ సీఎం కేసీఆర్పై మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తుగ్లక్ నిర్ణయాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు. మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీస్లో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని పూర్తిగా మరిచిపోయారన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని మాటిచ్చిన కేసీఆర్.. కేవలం తన కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారం చేసేందుకే పని చేస్తున్నారని, ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిన కేసీఆర్.. తన కుటుంబానికి చెందిన ఆరుగురికి మాత్రం పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదని వివేక్ వెంకటస్వామి చెప్పారు. రైతులకు ఫ్రీ ఫెర్టిలైజర్స్, ఉచిత విద్య, దళితులకు మూడెకరాలు ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్న మాటని సైతం తప్పారన్నారు. భగీరథ పథకం విషయంలో టీఆర్ఎస్ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, పోలీసులను వాడుకుంటూ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్కు పోయే కాలం దగ్గర పడిందని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా సరే.. మునుగోడులో బీజేపీ గెలుపుని ఆపలేరని వెల్లడించారు.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
అంతకుముందు.. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ఒక్క కేసీఆర్కి మాత్రమే దక్కుతుందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేసీఆర్ తన ఆస్తులు మాత్రమే పెంచుకున్నారన్నారు. 86 మంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాలను పట్టించుకోకుండా.. మునుగోడులో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడు ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?