USA: అమెరికా డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని హత్య చేయడానికి వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని వదులుకోవాలనేది యూఎస్ ప్రధాన డిమాండ్. దీనికి ఇరాన్ నిరాకరిస్తే కొత్త లీడర్ను కూడా అంతమొందించే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. కొత్త సుప్రీంలీడర్ను హతమార్చేందుకు ఇజ్రాయిల్కు మద్దతు ఇస్తామని ట్రంప్ చెబుతున్నారు.
Read Also: Nara Lokesh: ఏపీలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు..
ఫిబ్రవరి 28న ఇరాన్పై యూఎస్-ఇజ్రాయిల్ దళాలు వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరనించారు. ఇటీవలే, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ కొత్త లీడర్గా నియమితులయ్యారు. మోజ్తాబాను ఎన్నుకు్న తర్వాత ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ కొత్త లీడర్ మొజ్తాబా ‘‘ప్రశాంతంగా జీవించలేరు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియలో తన భాగస్వామ్యం ఉండాలని గతంలో ట్రంప్ కోరుకున్నారు.
ఇదిలా ఉంటే, అయతొల్లా అలీ ఖమేనీ తన వీలునామాలో తన కుమారుడు మోజ్తాబా ఖమేనీ తన వారసుడిగా ఇరాన్ పాలకుడు కాకూడదని స్పష్టంగా పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ, ఇరాన్ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మోజ్తాబా సుప్రీం లీడర్ అయ్యేలా ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అలీ ఖమేనీ బతికి ఉన్నప్పుడు మోజ్తాబాకు ఎలాంటి ప్రభుత్వ అధికారిక పదవులు లేవు, కానీ ఇరాన్ రాజకీయాలను వెనకనుంచి నడిపించే వ్యక్తిగా పేరుంది.