North Korea: కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కారణం ఇదేనా..?
- కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న కిమ్..
- తదుపరి వారసురాలిగా ఆమెనే అనే ప్రచారం..
- ఆయుధాల ఫ్యాక్టరీ సందర్శించిన తండ్రీ కూతుళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా దేశాధినేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శైలే వేరుగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా తన కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్తుంటారు. తాజాగా ఒక తుపాకుల ఫ్యాక్టరీని సందర్శించిన ఈ తండ్రీకూతుళ్లు.. అక్కడ పిస్టల్ పట్టి గురిచూసి కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
అసలు ఏం జరిగింది?
ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి బుధవారం ఒక ఆయుధాల ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ కొత్తగా తయారవుతున్న పిస్టళ్లను, ఇతర చిన్న రకం ఆయుధాలను ఆయన పరిశీలించారు. కేవలం చూడటమే కాకుండా, షూటింగ్ రేంజ్కు వెళ్లి స్వయంగా తుపాకీని పేల్చారు. ఆ కొత్త పిస్టల్ పనితీరు చాలా బాగుందని కిమ్ మెచ్చుకున్నారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
Also Read:Nara Lokesh: ఏపీలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు..
ఈ పర్యటనలో కిమ్ కుమార్తె కిమ్ జూ ఏ కూడా తండ్రితో కలిసి గన్తో గురిచూసి కాల్పులు జరిపింది. మిలిటరీ అధికారుల మధ్యలో ఆమె ఎంతో ధైర్యంగా తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కిమ్ తన కూతురిని చిన్నప్పటి నుంచే ఇలాంటి మిలిటరీ ఈవెంట్లకు, క్షిపణి ప్రయోగాలకు, ఫ్యాక్టరీల ప్రారంభోత్సవాలకు తీసుకువెళ్తున్నారు. రీసెంట్గా ఆమె ఒక స్నిపర్ రైఫిల్ను కూడా టెస్ట్ చేసినట్లు సమాచారం.
Also Read:House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..
చాలా కాలంగా కిమ్ జోంగ్ ఉన్ అణు ఆయుధాల మీద దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు సాధారణ సైనిక బలగాలను కూడా ఆధునీకరించాలని భావిస్తున్నారు. అందుకే ఈ ఫ్యాక్టరీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. కిమ్ తన కుమార్తెను పదేపదే ఇలాంటి కీలకమైన వేదికల మీదకు తీసుకురావడం వెనుక పెద్ద ప్లానే ఉందని నిపుణులు అంటున్నారు. తన తర్వాత తన కుటుంబం నుంచే నాలుగో తరం నాయకురాలిగా ఆమెను కిమ్ సిద్ధం చేస్తున్నారని దక్షిణ కొరియా నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం తుపాకులే కాదు.. అంతకు ముందు రోజు వీరిద్దరూ కలిసి ఒక యుద్ధ నౌక నుంచి క్షిపణులను ప్రయోగించే దృశ్యాలను కూడా తిలకించారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..