North Korea: కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కారణం ఇదేనా..?
- కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న కిమ్..
- తదుపరి వారసురాలిగా ఆమెనే అనే ప్రచారం..
- ఆయుధాల ఫ్యాక్టరీ సందర్శించిన తండ్రీ కూతుళ్లు..
సాధారణంగా దేశాధినేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శైలే వేరుగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా తన కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్తుంటారు. తాజాగా ఒక తుపాకుల ఫ్యాక్టరీని సందర్శించిన ఈ తండ్రీకూతుళ్లు.. అక్కడ పిస్టల్ పట్టి గురిచూసి కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
అసలు ఏం జరిగింది?
ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి బుధవారం ఒక ఆయుధాల ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ కొత్తగా తయారవుతున్న పిస్టళ్లను, ఇతర చిన్న రకం ఆయుధాలను ఆయన పరిశీలించారు. కేవలం చూడటమే కాకుండా, షూటింగ్ రేంజ్కు వెళ్లి స్వయంగా తుపాకీని పేల్చారు. ఆ కొత్త పిస్టల్ పనితీరు చాలా బాగుందని కిమ్ మెచ్చుకున్నారు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
Also Read:Nara Lokesh: ఏపీలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు..
ఈ పర్యటనలో కిమ్ కుమార్తె కిమ్ జూ ఏ కూడా తండ్రితో కలిసి గన్తో గురిచూసి కాల్పులు జరిపింది. మిలిటరీ అధికారుల మధ్యలో ఆమె ఎంతో ధైర్యంగా తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కిమ్ తన కూతురిని చిన్నప్పటి నుంచే ఇలాంటి మిలిటరీ ఈవెంట్లకు, క్షిపణి ప్రయోగాలకు, ఫ్యాక్టరీల ప్రారంభోత్సవాలకు తీసుకువెళ్తున్నారు. రీసెంట్గా ఆమె ఒక స్నిపర్ రైఫిల్ను కూడా టెస్ట్ చేసినట్లు సమాచారం.
Also Read:House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..
చాలా కాలంగా కిమ్ జోంగ్ ఉన్ అణు ఆయుధాల మీద దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు సాధారణ సైనిక బలగాలను కూడా ఆధునీకరించాలని భావిస్తున్నారు. అందుకే ఈ ఫ్యాక్టరీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. కిమ్ తన కుమార్తెను పదేపదే ఇలాంటి కీలకమైన వేదికల మీదకు తీసుకురావడం వెనుక పెద్ద ప్లానే ఉందని నిపుణులు అంటున్నారు. తన తర్వాత తన కుటుంబం నుంచే నాలుగో తరం నాయకురాలిగా ఆమెను కిమ్ సిద్ధం చేస్తున్నారని దక్షిణ కొరియా నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం తుపాకులే కాదు.. అంతకు ముందు రోజు వీరిద్దరూ కలిసి ఒక యుద్ధ నౌక నుంచి క్షిపణులను ప్రయోగించే దృశ్యాలను కూడా తిలకించారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?