Sangareddy: సంగారెడ్డిలో ఉద్రిక్తత.. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నేడు SFI రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఉండటంతో SFI కార్యకర్తలు జెండాలు కడుతున్నారు. అయితే ఒక్కసారిగా ABVP కార్యకర్తలు అక్కడకు వచ్చారు. SFI నాయకులపై ఒక్కసారిగా దాడి చేసారు. SFI నాయకులకు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ABVP కార్యకర్తలు ఎందుకు దాడి చేస్తున్నారో ప్రశ్నార్థంగా మారింది. ఎందుకు దాడి చేస్తున్నారు అని అడుగుతున్న సంగారెడ్డి SFI జిల్లా కార్యదర్శి రమేష్ తలపై ABVP కార్యకర్తలు బలంగా దాడి చేసారు. దీంతో రమేష్ కు తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయాడు. రమేష్ ని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Read also: TS TRT : 5,089 పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల..
Also Read
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర సర్వసభ్య సమావేశం నేటి నుంచి ఆదివారం వరకు సంగారెడ్డిలో జరగనుంది. విద్యారంగం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్.మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగం సమస్యల వలయంలో చిక్కుకుందని అన్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు అభివృద్ధి లేదన్నారు. పాఠశాలల్లో 24 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5,089 పోస్టులను భర్తీ చేయడం సరికాదన్నారు. యూనివర్సిటీల్లో 5,552 టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయని వివరించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శించారు. విద్యారంగంలో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలున్నాయని, మెరుగైన వసతులు కల్పించడం లేదన్నారు.
ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సైకిల్ జాతాలు, పాదయాత్రలు, జీపు జాతాల ద్వారా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. పూర్తిస్థాయిలో సర్వేలు చేసి ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు, రక్షణ గోడలు, కరెంటు, మంచినీరు, సైకిల్ స్టాండ్లు, రవాణా సౌకర్యం, హాస్టళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కంప్యూటర్లు, స్కావెంజర్లను నియమించలేదన్నారు. మన ఊరు-మనబడి ద్వారా పాఠశాలలను బాగుచేయించి కాంట్రాక్టర్లు నిధులు దండుకుంటున్నారని విమర్శించారు. చార్జీలు పెంచాలని చెబుతున్న బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. నూతన విద్యావిధానానికి రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తున్నదన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమం కరువయ్యిందని, అద్దె భవనాల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని తెలిపారు.
Viral Video: ఈ కొంగ ఏంటి పిల్లను అలా పడేసింది? కారణం అదే అయ్యింటుందా?
తాజావార్తలు
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
-
ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..