Child Kidnap: లగేజ్ బ్యాగ్లో దాచి…ఆరునెలల బాబు కిడ్నాప్ కథ సుఖాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలను కిడ్నాప్ చేస్తారు.. కొద్ది రోజులు పెంచుతారు.. లోకం పోకడ తెలియగానే.. బిచ్చగాళ్లుగా మారుస్తారు.. ఆరు నెలల పసికందుపై కన్నేసిన ఇద్దరు మాయలేడీలు.. బాలునితో బిక్షాటన చేయించాలని పథకం రచించి.. సికీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. తల్లి ఒడికి దూరమైన 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ పోలీసులు కేసును చేధించి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. పసికందును తల్లి ఒడికి చేర్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని.. వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి -కిషన్ దంపతులు భిక్షాటన చేస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మి తన పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తున్న క్రమంలో.. మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు లక్ష్మితో మాటలు కలిపారు. ఆరు నెలల బాలుడు కార్తీక్ కు .. పాత బట్టలు ఇస్తామంటూ లక్ష్మి చేతిలో బాబును ఎత్తుకుని.. ఇదిగో వస్తామంటూ మాయమయ్యారు. బాబును ఎత్తుకెళ్లారని గ్రహించిన లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆర్య నగర్ లో ఉంటున్న మాయ లేడీలను పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించారు. పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో బాబును లగేజీ బ్యాగ్ లో కుక్కి.. బాబు లేరంటూ పోలీసులను బుకాయించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు బాబును గుర్తించి తల్లి ఒడికి చేర్చారు. అపహరణకు గురైన 24 గంటల్లోపు పసికందును తల్లి ఒడికి చేర్చారు. కొడుకు కోసం తల్లడిల్లిన ఆ పేద తల్లి ఒడికి బిడ్డను చేర్చిన పోలీసులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు భిక్షాటన చేస్తూ.. ఆర్యనగర్ లో స్దిరపడ్డారు. ఓ పసికందును అపహరించి భిక్షాటన చేయించాలని ప్లాన్ తో.. లక్ష్మి కుమారుని పై కన్నేశారు. ఆరు నెలల పసికందును పక్కా ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేసి.. పరారయ్యారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అపహరించిన మహిళల నుంచి బాలున్ని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. బాలునితో భిక్షాటన చేయించాలని, బేరం కుదిరితే అమ్మాలని ప్లాన్ తో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అపరిచితుల తో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితులకు నేర చరిత్ర ఉందా..గతంలో ఇలాంటి కిడ్నాప్ లు చేశారా అని లోతుగా విచారిస్తామని పోలీసులు తెలిపారు. కొడుకు కోసం 24 గంటలుగా తల్లడిల్లిన ఆ తల్లి తన కొడుకుని చూసి గుండెలకు హత్తుకుంది. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన టాస్క్ పోర్స్, సీసీఎస్, నాలుగో టౌన్ పోలీసులకు ఉన్నతాధికారులు అభినందించారు.
Vamshi Paidipally: సర్కారు కోసం తమన్ నన్ను కూడా పక్కన పెట్టేశాడు
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..