Child Kidnap: లగేజ్ బ్యాగ్లో దాచి…ఆరునెలల బాబు కిడ్నాప్ కథ సుఖాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలను కిడ్నాప్ చేస్తారు.. కొద్ది రోజులు పెంచుతారు.. లోకం పోకడ తెలియగానే.. బిచ్చగాళ్లుగా మారుస్తారు.. ఆరు నెలల పసికందుపై కన్నేసిన ఇద్దరు మాయలేడీలు.. బాలునితో బిక్షాటన చేయించాలని పథకం రచించి.. సికీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. తల్లి ఒడికి దూరమైన 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ పోలీసులు కేసును చేధించి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. పసికందును తల్లి ఒడికి చేర్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని.. వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి -కిషన్ దంపతులు భిక్షాటన చేస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మి తన పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తున్న క్రమంలో.. మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు లక్ష్మితో మాటలు కలిపారు. ఆరు నెలల బాలుడు కార్తీక్ కు .. పాత బట్టలు ఇస్తామంటూ లక్ష్మి చేతిలో బాబును ఎత్తుకుని.. ఇదిగో వస్తామంటూ మాయమయ్యారు. బాబును ఎత్తుకెళ్లారని గ్రహించిన లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆర్య నగర్ లో ఉంటున్న మాయ లేడీలను పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించారు. పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో బాబును లగేజీ బ్యాగ్ లో కుక్కి.. బాబు లేరంటూ పోలీసులను బుకాయించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు బాబును గుర్తించి తల్లి ఒడికి చేర్చారు. అపహరణకు గురైన 24 గంటల్లోపు పసికందును తల్లి ఒడికి చేర్చారు. కొడుకు కోసం తల్లడిల్లిన ఆ పేద తల్లి ఒడికి బిడ్డను చేర్చిన పోలీసులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు భిక్షాటన చేస్తూ.. ఆర్యనగర్ లో స్దిరపడ్డారు. ఓ పసికందును అపహరించి భిక్షాటన చేయించాలని ప్లాన్ తో.. లక్ష్మి కుమారుని పై కన్నేశారు. ఆరు నెలల పసికందును పక్కా ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేసి.. పరారయ్యారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అపహరించిన మహిళల నుంచి బాలున్ని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. బాలునితో భిక్షాటన చేయించాలని, బేరం కుదిరితే అమ్మాలని ప్లాన్ తో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అపరిచితుల తో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితులకు నేర చరిత్ర ఉందా..గతంలో ఇలాంటి కిడ్నాప్ లు చేశారా అని లోతుగా విచారిస్తామని పోలీసులు తెలిపారు. కొడుకు కోసం 24 గంటలుగా తల్లడిల్లిన ఆ తల్లి తన కొడుకుని చూసి గుండెలకు హత్తుకుంది. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన టాస్క్ పోర్స్, సీసీఎస్, నాలుగో టౌన్ పోలీసులకు ఉన్నతాధికారులు అభినందించారు.
Vamshi Paidipally: సర్కారు కోసం తమన్ నన్ను కూడా పక్కన పెట్టేశాడు
తాజావార్తలు
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!