Child Kidnap: లగేజ్ బ్యాగ్లో దాచి…ఆరునెలల బాబు కిడ్నాప్ కథ సుఖాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలను కిడ్నాప్ చేస్తారు.. కొద్ది రోజులు పెంచుతారు.. లోకం పోకడ తెలియగానే.. బిచ్చగాళ్లుగా మారుస్తారు.. ఆరు నెలల పసికందుపై కన్నేసిన ఇద్దరు మాయలేడీలు.. బాలునితో బిక్షాటన చేయించాలని పథకం రచించి.. సికీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. తల్లి ఒడికి దూరమైన 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ పోలీసులు కేసును చేధించి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. పసికందును తల్లి ఒడికి చేర్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని.. వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి -కిషన్ దంపతులు భిక్షాటన చేస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మి తన పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తున్న క్రమంలో.. మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు లక్ష్మితో మాటలు కలిపారు. ఆరు నెలల బాలుడు కార్తీక్ కు .. పాత బట్టలు ఇస్తామంటూ లక్ష్మి చేతిలో బాబును ఎత్తుకుని.. ఇదిగో వస్తామంటూ మాయమయ్యారు. బాబును ఎత్తుకెళ్లారని గ్రహించిన లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది.
Also Read
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆర్య నగర్ లో ఉంటున్న మాయ లేడీలను పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించారు. పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో బాబును లగేజీ బ్యాగ్ లో కుక్కి.. బాబు లేరంటూ పోలీసులను బుకాయించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు బాబును గుర్తించి తల్లి ఒడికి చేర్చారు. అపహరణకు గురైన 24 గంటల్లోపు పసికందును తల్లి ఒడికి చేర్చారు. కొడుకు కోసం తల్లడిల్లిన ఆ పేద తల్లి ఒడికి బిడ్డను చేర్చిన పోలీసులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు భిక్షాటన చేస్తూ.. ఆర్యనగర్ లో స్దిరపడ్డారు. ఓ పసికందును అపహరించి భిక్షాటన చేయించాలని ప్లాన్ తో.. లక్ష్మి కుమారుని పై కన్నేశారు. ఆరు నెలల పసికందును పక్కా ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేసి.. పరారయ్యారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అపహరించిన మహిళల నుంచి బాలున్ని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. బాలునితో భిక్షాటన చేయించాలని, బేరం కుదిరితే అమ్మాలని ప్లాన్ తో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అపరిచితుల తో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితులకు నేర చరిత్ర ఉందా..గతంలో ఇలాంటి కిడ్నాప్ లు చేశారా అని లోతుగా విచారిస్తామని పోలీసులు తెలిపారు. కొడుకు కోసం 24 గంటలుగా తల్లడిల్లిన ఆ తల్లి తన కొడుకుని చూసి గుండెలకు హత్తుకుంది. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన టాస్క్ పోర్స్, సీసీఎస్, నాలుగో టౌన్ పోలీసులకు ఉన్నతాధికారులు అభినందించారు.
Vamshi Paidipally: సర్కారు కోసం తమన్ నన్ను కూడా పక్కన పెట్టేశాడు
తాజావార్తలు
-
Varun Tej : ‘ఎన్టీఆర్ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
-
Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!