Child Kidnap: లగేజ్ బ్యాగ్లో దాచి…ఆరునెలల బాబు కిడ్నాప్ కథ సుఖాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలను కిడ్నాప్ చేస్తారు.. కొద్ది రోజులు పెంచుతారు.. లోకం పోకడ తెలియగానే.. బిచ్చగాళ్లుగా మారుస్తారు.. ఆరు నెలల పసికందుపై కన్నేసిన ఇద్దరు మాయలేడీలు.. బాలునితో బిక్షాటన చేయించాలని పథకం రచించి.. సికీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. తల్లి ఒడికి దూరమైన 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ పోలీసులు కేసును చేధించి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. పసికందును తల్లి ఒడికి చేర్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని.. వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి -కిషన్ దంపతులు భిక్షాటన చేస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మి తన పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తున్న క్రమంలో.. మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు లక్ష్మితో మాటలు కలిపారు. ఆరు నెలల బాలుడు కార్తీక్ కు .. పాత బట్టలు ఇస్తామంటూ లక్ష్మి చేతిలో బాబును ఎత్తుకుని.. ఇదిగో వస్తామంటూ మాయమయ్యారు. బాబును ఎత్తుకెళ్లారని గ్రహించిన లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆర్య నగర్ లో ఉంటున్న మాయ లేడీలను పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించారు. పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో బాబును లగేజీ బ్యాగ్ లో కుక్కి.. బాబు లేరంటూ పోలీసులను బుకాయించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు బాబును గుర్తించి తల్లి ఒడికి చేర్చారు. అపహరణకు గురైన 24 గంటల్లోపు పసికందును తల్లి ఒడికి చేర్చారు. కొడుకు కోసం తల్లడిల్లిన ఆ పేద తల్లి ఒడికి బిడ్డను చేర్చిన పోలీసులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
మహారాష్ట్రకు చెందిన పద్మ, రేణుకా పవార్ లు భిక్షాటన చేస్తూ.. ఆర్యనగర్ లో స్దిరపడ్డారు. ఓ పసికందును అపహరించి భిక్షాటన చేయించాలని ప్లాన్ తో.. లక్ష్మి కుమారుని పై కన్నేశారు. ఆరు నెలల పసికందును పక్కా ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేసి.. పరారయ్యారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అపహరించిన మహిళల నుంచి బాలున్ని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. బాలునితో భిక్షాటన చేయించాలని, బేరం కుదిరితే అమ్మాలని ప్లాన్ తో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అపరిచితుల తో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితులకు నేర చరిత్ర ఉందా..గతంలో ఇలాంటి కిడ్నాప్ లు చేశారా అని లోతుగా విచారిస్తామని పోలీసులు తెలిపారు. కొడుకు కోసం 24 గంటలుగా తల్లడిల్లిన ఆ తల్లి తన కొడుకుని చూసి గుండెలకు హత్తుకుంది. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన టాస్క్ పోర్స్, సీసీఎస్, నాలుగో టౌన్ పోలీసులకు ఉన్నతాధికారులు అభినందించారు.
Vamshi Paidipally: సర్కారు కోసం తమన్ నన్ను కూడా పక్కన పెట్టేశాడు
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!