GST: తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం.. రూ.84 కోట్లు కొట్టేసిన కేటుగాడు..
- జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు..
- రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తింపు..
- ఎస్కేజీ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్ సందీప్ అరెస్ట్..
తెలంగాణలో భారీ జీఎస్టీ (GST) కుంభకోణాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఛేదించారు. నకిలీ ఇన్వాయిస్లతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ రాష్ట్రంలో జరుగుతున్న భారీ పన్నుల దోపిడీని వెలుగులోకి తెచ్చింది. ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి, అసలు సరుకు సరఫరా చేయకుండానే దాదాపు రూ.84.15 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందిన భారీ మోసాన్ని అధికారులు కనిపెట్టారు. ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్కేజీ (SKG) ట్రేడింగ్ కంపెనీ యజమాని సందీప్ కుమార్ గోయల్ను అధికారులు అరెస్ట్ చేశారు.
Also Read:AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు.. మరో పథకం అందుబాటులోకి..
Also Read
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
అసలు మోసం జరిగిందిలా..
వాణిజ్య పన్నుల శాఖ నిర్వహించిన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. సందీప్ కుమార్ తన ఎస్కేజీ ట్రేడింగ్ కంపెనీ ద్వారా ఎలాంటి వస్తువులను విక్రయించకుండానే.. కేవలం కాగితాల మీద ఇన్వాయిసులు సృష్టించి కోట్లాది రూపాయల ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఇతను కేవలం ఒక్క కంపెనీకే పరిమితం కాకుండా.. హెచ్ఎఫ్సీ స్టీల్ ట్యూబ్స్ అండ్ వాల్వ్స్, విజయ్ ఇండస్ట్రియల్ నీడ్స్ LLP వంటి ఇతర సంస్థల పేర్లతో కూడా ఇదే తరహా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.
Also Read:Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..
ఈ మోసం బయటపడటంతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. అక్రమాలకు పాల్పడిన రెండు సంస్థల జీఎస్టీ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. నిందితుడు సందీప్ కుమార్పై తెలంగాణ GST చట్టం-2017 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఇలాంటి నకిలీ ఐటీసీ క్లెయిమ్లపై ఉక్కుపాదం మోపుతామని వాణిజ్య పన్నుల శాఖ హెచ్చరించింది. ఎస్కేజీ ట్రేడింగ్ కంపెనీ లావాదేవీలపై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నామని.. ఈ గొలుసుకట్టు మోసంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించే వారిపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?