Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టుకు బీజేపీ.. పోలీసుల నిర్ణయంపై పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Padayatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాదయాత్ర మొదలవుతుందా..? లేదా? అనేది సస్పెన్స్గా మారింది. లా అండ్ ఆర్డర్ కారణాల వల్ల చివరి నిమిషంలో పోలీసులు మార్చ్కు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు బండి సంజయ్ పాదయాత్రపై మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐదో దశ పాదయాత్ర ప్రారంభానికి బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను రాష్ట్ర బీజేపీ నేతలు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చివరి నిమిషంలో పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఫడ్నవీస్ రాకపై కూడా డైలమా నెలకొంది. హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయని, పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని కాషాయ వర్గాలు భావిస్తున్నాయి.
Read also: CM KCR: నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం.. ధరణీ సమస్యలపై చర్చ
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
సోమవారం భైంసా నుంచి ఐదో దశ ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభించేందుకు బీజేపీ ఇప్పటికే రూట్ మ్యాప్ను ఫిక్స్ చేసింది. ఇందుకు పోలీసులు ముందస్తుగా అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం భైంసా నుంచి పాదయాత్రకు బయలుదేరిన సంజయ్ను జగిత్యాలలో పోలీసులు అడ్డుకున్నారు. భైంసా సున్నిత ప్రాంతమని, పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్ను అరెస్టు చేసి కరీంనగర్లోని అతని ఇంటికి తీసుకెళ్లారు.
Read also: China Boy Watching TV: టీవీ చూస్తున్నాడని.. కుమారుడికి పేరెంట్స్ కఠిన శిక్ష
బండి సంజయ్ కామెంట్స్ :
ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాలుగు విడతలు ప్రశాంతంగా యాత్ర చేసామని బండి సంజయ్ అన్నారు. అన్ని యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఐదో విడత రేపు ఉదయం 12.30 నిమిషాలకు ప్రారంభించాలను కున్నామని తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు బాబురావు అన్ని పర్మిషన్ లు కు అప్లయ్ చేశారని అన్నారు. రోడ్ మ్యాప్ బహిరంగ సభ ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయని తెలిపారు బండి సంజయ్. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెర్నాండెస్ పర్యటన కు అన్ని ఏర్పాట్లులో పోలీసులు పాల్గొన్నారు. బైంసా వెళ్తుండగా కోరుట్ల దగ్గర పోలీసులు నన్ను ఆపారని మండిపడ్డారు. పోలీసులు పహారా చేస్తూ బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. పర్మిషన్ అప్లై చేసినప్పుడు బైంసా సెన్సిటివ్ ప్లేస్ అని ముఖ్యమంత్రి కి గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. వారం రోజులుగా అక్కడ ఏర్పాట్లు జరుగుతుంటే అప్పుడు తెలియలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బైంసా తెలంగాణ లో ఒక భాగంని తెలుసుకో.. అంటూ మండిపడ్డారు. బైంసాని కాపాడని ముఖ్యమంత్రి ఏమనాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు యాత్రకు పోలీసులు డ్యూటీ కూడా వేశారని చెప్పారని, బైంసా పోవాలంటే మేము వీసా తీసుకుని పోవాలా అది వేరే దేశంలో ఉందా? అంటూ ప్రశ్నించారు బండిసంజయ్. 15 ఇల్లు దగ్ధం చేస్తే పట్టించుకొని ప్రభుత్వం ఇక్కడ ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర గొడవలు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాతబస్తి నుండే యాత్ర ప్రశాంతంగా నిర్వహించాము బైంసా నుండి అలానే చేస్తామని సంపథం చేశారు. తెలంగాణ లో శాంతి భద్రతలు క్షిణించాయని మండిపడ్డారు. కార్యకర్తలను కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినే ముఖ్య సమస్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండిసంజయ్.
Thalapathy Vijay: 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ…
తాజావార్తలు
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
-
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!