BJP national executive meeting: కేసీఆర్ ఇలాకాలో.. బీజేపీ కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. హైదరాబాద్ కేంద్రంగా జూలై 2,3 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల వేదిక గురించి ఈ రోజు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్.సంతోష్ హైదరాబాద్ లో పర్యటించిన వారు హెచ్ఐసీసీ వేదికను ఖరారు చేశారు. కార్యవర్గ సమావేశాలపై రాష్ట్ర నేతలైన విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, నల్లు ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి,ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్,పొంగులేటి సుధాకర్ రెడ్డిలతో సమావేశం అయ్యారు.
కేసీఆర్ ఇలాకాలో బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులతో పాటు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు రెండు రోజుల పాటు హైదరాబాద్లో బస చేయనున్నారు. ప్రధాని మోదీ రాజ్ భవన్ లో బస చేస్తారని.. ఇతర కేంద్ర మంత్రులు, నేతలు ప్రముఖ హోటళ్లలో బస చేయనున్నారు.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి బీజేపీ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తుంటుంది. అయితే కోవిడ్ కారణంగా చాలా రోజులు వాయిదా పడిన ఈ సమావేశాలు చివరిసారిగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు 2021 నవంబర్ లో జరిగింది. పార్టీ సంస్థాగత నిర్ణయాలు, వర్తమాన రాజకీయాలు, ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతుంటాయి. దీంతో పాటు 2024 ఎన్నికల ఎజెండా కూడా సమావేశాల్లో చర్చించనున్నారు. ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తున్నారు సీఎం కేసీఆర్. మోదీకి వ్యతిరేఖంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ నేతలను ఒకే తాటిపైకి తెచ్చే విధంగా కార్యచరణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబ రాజకీయాల గురించి తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. అంతకుముందు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. తాము తెలంగాణపై ఫోకస్ పెట్టామనే స్పష్టమైన సంకేతాలు టీఆర్ఎస్ పార్టీకి పంపించారు.
తాజావార్తలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
-
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
-
Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!