K Laxman: మహిళల పట్ల ఎమ్మెల్సీ కవిత మొసలికన్నీరు కార్చుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K Laxman Fires On MLC Kavitha: మహిళల పట్ల ఎమ్మెల్సీ కవిత మొసలికన్నీరు కార్చుతున్నారంటూ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా బండి సంజయ్ చేపట్టిన దీక్షలో కే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబానికి నచ్చితే మెచ్చుకుంటారు లేదంటే అణచివేస్తారని, ఇది తెలంగాణ సమాజానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోపించారు. డాక్టర్ స్థాయికి ఎదిగిన గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతిని హింసించడం వల్లే ప్రాణాలు పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రీతి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదని మండిపడ్డారు.
Bandi Sanjay: బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. యూపీ తరహా విధానం తెస్తాం
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నా చేస్తారంటున్నారని, ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న కవిత ఏరోజూ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదని కే లక్ష్మణ్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లపై ముందు మీ పార్టీలో చర్చించాలన్నారు. మహిళా సంక్షేమంపై బీజేపీకా నీతులు చెప్పేది? అని ప్రశ్నించారు. గిరిజన ఆదివాసీ మహిళను తాము రాష్ట్రపతి చేశామని, కానీ అడవి బిడ్డను రాష్ట్రపతిగా ఓడించడానికి కేసీఆర్ కుట్రలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు నదులను ఏమో కానీ.. మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణంలో మహిళలు ఏంటి? సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4200 కోట్లు బకాయిలు పడిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని.. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు.
Preethi Case: కేసు విషయంలో అన్యాయం జరుగుతోంది.. ప్రీతి కుటుంబం
అంతకుముందు.. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని కే లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ద్వారా ఏటా రూ.6 వేల కోట్ల ఆదాయం ఉండగా, ఇప్పుడు రూ.45 వేల కోట్లకు చేరిందని అన్నారు. గ్రామాల్లో బెల్టు దుకాణాల వల్ల అనర్థాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. యువత అనారోగ్యానికి గురై మృతి చెందుతుంటే, మహిళలు చిన్న వయసులోనే వితంతువులుగా మారుతున్నారని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. బీఆర్ఎస్ పాలన కారణంగా ఆగమైందని విమర్శించారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ నినాదంతో.. దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని వెల్లడించారు.
Nawazuddin Siddiqui: మాజీ భార్య ఆరోపణలకు బదులిచ్చిన బాలీవుడ్ స్టార్!
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!