Preethi Case: కేసు విషయంలో అన్యాయం జరుగుతోంది.. ప్రీతి కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preethi Family Members On Case: కేసు విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ప్రీతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని బాంబ్ పేల్చారు. ఈ కేసులో సైఫ్తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రీతి కుటుంబం.. వారందరినీ విచారించాల్సిందిగా కోరారు. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్కి వెళ్లిన ప్రీతి కుటుంబం.. అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ని కలిసి వినతి పత్రం అందించారు. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి, నిందితులను శిక్షించాలని కోరామన్నారు. కేఎంసీ హెచ్ఓడీ నాగార్జున రెడ్డిని ట్రాన్స్ఫర్ చేయడం కాదు, పూర్తిగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగింది ఆపరేషన్ థియేటర్లో కాబట్టి.. ఆ సమయంలో అక్కడున్న వారందరినీ విచారించాలన్నారు. టాక్సీకాలజీ రిపోర్ట్ ఇంకా రాలేదని పోలీసులు చెబుతున్నారని తెలిపారు.
DK Aruna: ప్రీతి కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.. నిజానిజాలు బయటకు రావాలి
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ఈ సందర్భంగా ప్రీతి బ్రదర్ పృథ్వీ మాట్లాడుతూ.. తన అక్కకు న్యాయం జరిగేవరకు పోరాడుతానన్నాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ క్లియర్గా ఉన్నా.. మెడికల్ ఇన్వెస్టిగేషన్ మాత్రం పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించాడు. పోస్టుమార్టం రిపోర్ట్ కూడా మ్యానిపులేట్ చేస్తారని వ్యాఖ్యానించాడు. ఘటన జరిగిన రోజే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తే, కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేవని తెలిపాడు. ఘటన జరిగిన రోజు ఏమైందో క్లియర్గా చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ నుంచి బాడీని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేశారని.. అసలు తమ అక్కకి ఏం ట్రీట్మెంట్ చేశారో, సర్జరీ ఎందుకు చేశారో చెప్పాలని కోరాడు. అనంతరం ప్రీతి సిస్టర్ మాట్లాడుతూ.. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని వేడుకుంది. న్యాయం జరిగేంతవరకు తాము పోరాడుతామని తెలిపింది. రిపోర్ట్స్ అన్నీ తారుమారు అయ్యాయని, ఇప్పటివరకు తమకు ఎలాంటి రిపోర్ట్స్ అందలేదని, దర్యాప్తు ఎలా సాగుతుందో తమకు తెలియదని పేర్కొంది.
MLC Kavitha: మహిళలు వంట గదిలోనే ఉండాలన్న రోజులు పోవాలి
ఇదే సమయంలో ప్రీతి తల్లి శారద మాట్లాడుతూ.. ప్రీతి కేసు విషయంలో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం వెలిబుచ్చారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నానని కోరారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి రిపోర్ట్ రాలేదన్నారు. దర్యాప్తు ఎటువైపు సాగుతుందో తెలియడం లేదని, న్యాయం జరిగేవరకు పోరాడుతామని తెలిపారు. మరోవైపు.. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్లో విష పదార్థాలు డిటెక్ట్ కాలేదని వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని.. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ తేల్చింది. దీంతో.. ఈ ఆత్మహత్యాయత్నం కేసుని ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చేందుకు పోలీసులు యోచిస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!