ఈటల కోసం ఓట్లు ప్రజలు ఫిక్సుడ్ డిపాజిట్ చేసారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మధువని గార్డెన్ లో పురప్రముఖుల సమావేశం జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. అందులో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుస్తున్నారన్న టాక్ ఇప్పటికే వచ్చింది. హుజురాబాద్ గురించి తెలిసిన ప్రపంచంలోని అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఈటల గెలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేతిలోకి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏర్పాటు చేయాల్సి ఉండేది. ఇప్పటికే ఆలస్యమైంది. అమిత్ షా, మోడీకి నేను ఎప్పుడూ చెబుతూ ఉండేది. అన్ని రాష్ట్రాల కంటే ముందు బీజేపీ పాలన తెలంగాణలో ఏర్పడాలని చెబుతూ ఉండేది అన్నారు.
ఇక ఈటల రాజేందర్ కు పొమ్మనలేక పొగపెట్టారు అన్న ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయి. ఆత్మగౌరవం చాలా ప్రధానమైనది. అందుకే ఈటల బయటకు వచ్చారు. అంబేద్కర్ ఆనాడే ఆత్మగౌరవ ప్రాముఖ్యతను గుర్తించారు. ఏ వ్యక్తి కూడా తన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఇతరులకు కృతజ్ఞతగా ఉండరని.. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసారు. ఎవరైనా రాహుల్ పార్టీలోకి పోతారా అని అడిగారు. బీజేపీ గొప్పతనం గురించి, మోడీ గురించి తెలుసుకుని ఈటల బీజేపీ లో చేరారు. ఇప్పుడు ఎన్నికల్లో పంచుతున్న మద్యం, సారాలో తప్ప.. తెలంగాణలోని అన్ని పథకాల్లో కేంద్రం డబ్బులున్నాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలంటే మనం అందరం కలిసి మెలిసి ఉండాలి. టీఆర్ఎస్ పార్టీకంటే ముందు లెఫ్ట్ పార్టీలో ఉన్న తాను.. బీజేపీలోకి వస్తున్నట్లు ఈటల రాజేందర్ నాకు ఫోన్ చేస్తే… నీకు భయం అవసరం లేదు.. వెల్కం అని చెప్పాను. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఈటలను మీరెందుకు చేర్చుకున్నారని.. నన్ను ఓ విలేఖరి అడిగారు. అన్ని ఐడియాలజీలకు బీజేపీలో చోటుందని చెప్పాను అని తెలిపారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఇక ఈటల రాజేందర్ కోసం ఓట్లు ఇఫ్పటికే ప్రజలు ఫిక్సుడ్ డిపాజిట్ చేసారు అని చెప్పిన ఆయన జాయింట్ అకౌంట్లో ఉన్న మరికొన్ని ఓట్లను విడిపిస్తే ఈటల భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈటల రాజేందర్ విజయం ద్వారా బీజేపీ అధికారం సాధించేందుకు బాట వేయాలి. ఈ విజయం ద్వారా నరేంద్ర మోడీకి మనం బలం చేకూర్చిన వాళ్లం అవుతాం. సెప్టెంబరు 17ను విస్మరించినారంటే.. వాళ్లకు తెలంగాణ స్పూర్తి లేనట్లే. తెలంగాణ పోరాట వీరుడ రాంజీ గోండ్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఎందుకు పెట్టరు. వంటింట్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ ను పట్టుకుని రోడ్లపై తిప్పుతున్నారు. ధర ఎక్కువైతే మోడీని అడిగితే.. ఎందుకు పెరిగిందో చెబుతారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ ధరలు ఉంటాయి. కానీ 2014లో ఉన్న సిలిండర్లకంటే ఇప్పుడు రెట్టింపు మహిళలకు మోడీ ఇచ్చారనే విషయం ఎవరూ చెప్పడం లేదు. మిషన్ భగీరథ కాన్సెప్ట్ మంచిదే కానీ.. అది కూడా విఫలమైంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!