ఈటల కోసం ఓట్లు ప్రజలు ఫిక్సుడ్ డిపాజిట్ చేసారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మధువని గార్డెన్ లో పురప్రముఖుల సమావేశం జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. అందులో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుస్తున్నారన్న టాక్ ఇప్పటికే వచ్చింది. హుజురాబాద్ గురించి తెలిసిన ప్రపంచంలోని అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఈటల గెలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేతిలోకి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏర్పాటు చేయాల్సి ఉండేది. ఇప్పటికే ఆలస్యమైంది. అమిత్ షా, మోడీకి నేను ఎప్పుడూ చెబుతూ ఉండేది. అన్ని రాష్ట్రాల కంటే ముందు బీజేపీ పాలన తెలంగాణలో ఏర్పడాలని చెబుతూ ఉండేది అన్నారు.
ఇక ఈటల రాజేందర్ కు పొమ్మనలేక పొగపెట్టారు అన్న ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయి. ఆత్మగౌరవం చాలా ప్రధానమైనది. అందుకే ఈటల బయటకు వచ్చారు. అంబేద్కర్ ఆనాడే ఆత్మగౌరవ ప్రాముఖ్యతను గుర్తించారు. ఏ వ్యక్తి కూడా తన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఇతరులకు కృతజ్ఞతగా ఉండరని.. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసారు. ఎవరైనా రాహుల్ పార్టీలోకి పోతారా అని అడిగారు. బీజేపీ గొప్పతనం గురించి, మోడీ గురించి తెలుసుకుని ఈటల బీజేపీ లో చేరారు. ఇప్పుడు ఎన్నికల్లో పంచుతున్న మద్యం, సారాలో తప్ప.. తెలంగాణలోని అన్ని పథకాల్లో కేంద్రం డబ్బులున్నాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలంటే మనం అందరం కలిసి మెలిసి ఉండాలి. టీఆర్ఎస్ పార్టీకంటే ముందు లెఫ్ట్ పార్టీలో ఉన్న తాను.. బీజేపీలోకి వస్తున్నట్లు ఈటల రాజేందర్ నాకు ఫోన్ చేస్తే… నీకు భయం అవసరం లేదు.. వెల్కం అని చెప్పాను. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఈటలను మీరెందుకు చేర్చుకున్నారని.. నన్ను ఓ విలేఖరి అడిగారు. అన్ని ఐడియాలజీలకు బీజేపీలో చోటుందని చెప్పాను అని తెలిపారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ఇక ఈటల రాజేందర్ కోసం ఓట్లు ఇఫ్పటికే ప్రజలు ఫిక్సుడ్ డిపాజిట్ చేసారు అని చెప్పిన ఆయన జాయింట్ అకౌంట్లో ఉన్న మరికొన్ని ఓట్లను విడిపిస్తే ఈటల భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈటల రాజేందర్ విజయం ద్వారా బీజేపీ అధికారం సాధించేందుకు బాట వేయాలి. ఈ విజయం ద్వారా నరేంద్ర మోడీకి మనం బలం చేకూర్చిన వాళ్లం అవుతాం. సెప్టెంబరు 17ను విస్మరించినారంటే.. వాళ్లకు తెలంగాణ స్పూర్తి లేనట్లే. తెలంగాణ పోరాట వీరుడ రాంజీ గోండ్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఎందుకు పెట్టరు. వంటింట్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ ను పట్టుకుని రోడ్లపై తిప్పుతున్నారు. ధర ఎక్కువైతే మోడీని అడిగితే.. ఎందుకు పెరిగిందో చెబుతారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ ధరలు ఉంటాయి. కానీ 2014లో ఉన్న సిలిండర్లకంటే ఇప్పుడు రెట్టింపు మహిళలకు మోడీ ఇచ్చారనే విషయం ఎవరూ చెప్పడం లేదు. మిషన్ భగీరథ కాన్సెప్ట్ మంచిదే కానీ.. అది కూడా విఫలమైంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..