ఈటల కోసం ఓట్లు ప్రజలు ఫిక్సుడ్ డిపాజిట్ చేసారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మధువని గార్డెన్ లో పురప్రముఖుల సమావేశం జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. అందులో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుస్తున్నారన్న టాక్ ఇప్పటికే వచ్చింది. హుజురాబాద్ గురించి తెలిసిన ప్రపంచంలోని అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఈటల గెలిస్తే.. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేతిలోకి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏర్పాటు చేయాల్సి ఉండేది. ఇప్పటికే ఆలస్యమైంది. అమిత్ షా, మోడీకి నేను ఎప్పుడూ చెబుతూ ఉండేది. అన్ని రాష్ట్రాల కంటే ముందు బీజేపీ పాలన తెలంగాణలో ఏర్పడాలని చెబుతూ ఉండేది అన్నారు.
ఇక ఈటల రాజేందర్ కు పొమ్మనలేక పొగపెట్టారు అన్న ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయి. ఆత్మగౌరవం చాలా ప్రధానమైనది. అందుకే ఈటల బయటకు వచ్చారు. అంబేద్కర్ ఆనాడే ఆత్మగౌరవ ప్రాముఖ్యతను గుర్తించారు. ఏ వ్యక్తి కూడా తన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఇతరులకు కృతజ్ఞతగా ఉండరని.. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసారు. ఎవరైనా రాహుల్ పార్టీలోకి పోతారా అని అడిగారు. బీజేపీ గొప్పతనం గురించి, మోడీ గురించి తెలుసుకుని ఈటల బీజేపీ లో చేరారు. ఇప్పుడు ఎన్నికల్లో పంచుతున్న మద్యం, సారాలో తప్ప.. తెలంగాణలోని అన్ని పథకాల్లో కేంద్రం డబ్బులున్నాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలంటే మనం అందరం కలిసి మెలిసి ఉండాలి. టీఆర్ఎస్ పార్టీకంటే ముందు లెఫ్ట్ పార్టీలో ఉన్న తాను.. బీజేపీలోకి వస్తున్నట్లు ఈటల రాజేందర్ నాకు ఫోన్ చేస్తే… నీకు భయం అవసరం లేదు.. వెల్కం అని చెప్పాను. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఈటలను మీరెందుకు చేర్చుకున్నారని.. నన్ను ఓ విలేఖరి అడిగారు. అన్ని ఐడియాలజీలకు బీజేపీలో చోటుందని చెప్పాను అని తెలిపారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ఇక ఈటల రాజేందర్ కోసం ఓట్లు ఇఫ్పటికే ప్రజలు ఫిక్సుడ్ డిపాజిట్ చేసారు అని చెప్పిన ఆయన జాయింట్ అకౌంట్లో ఉన్న మరికొన్ని ఓట్లను విడిపిస్తే ఈటల భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈటల రాజేందర్ విజయం ద్వారా బీజేపీ అధికారం సాధించేందుకు బాట వేయాలి. ఈ విజయం ద్వారా నరేంద్ర మోడీకి మనం బలం చేకూర్చిన వాళ్లం అవుతాం. సెప్టెంబరు 17ను విస్మరించినారంటే.. వాళ్లకు తెలంగాణ స్పూర్తి లేనట్లే. తెలంగాణ పోరాట వీరుడ రాంజీ గోండ్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఎందుకు పెట్టరు. వంటింట్లో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్ ను పట్టుకుని రోడ్లపై తిప్పుతున్నారు. ధర ఎక్కువైతే మోడీని అడిగితే.. ఎందుకు పెరిగిందో చెబుతారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ ధరలు ఉంటాయి. కానీ 2014లో ఉన్న సిలిండర్లకంటే ఇప్పుడు రెట్టింపు మహిళలకు మోడీ ఇచ్చారనే విషయం ఎవరూ చెప్పడం లేదు. మిషన్ భగీరథ కాన్సెప్ట్ మంచిదే కానీ.. అది కూడా విఫలమైంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!