Bhatti Vikramarka: కాంగ్రెస్ గెలిస్తే, ఆ లక్ష్యాలన్నీ పూర్తవుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు తెలంగాణలోని వరంగల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు సంఘర్షణ సభ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుకకు తెలంగాణ వ్యాప్తంగా రైతులు తరలివచ్చారు. ఈ వేదిక సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సభ తొలిమెట్టు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తెచ్చిపెట్టిన తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతాంగ సోదరుల్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీకే మూడు లక్షల వరకు రుణాలు, సబ్సిడీకి ట్రాక్టర్లు & వ్యవసాయ పనిమూట్లు, మద్దతు ధరతో ధాన్యం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కానీ, టీఆర్ఎస్ రైతు బంధు పథకం తీసుకొచ్చి, ఆ స్కీమ్స్ని బంద్ చేసిందన్నారు. వ్యవసాయ రంగానికి, బలహీన వర్గాల్ని, పాడుభూమి వ్యవసాయం చేసుకునే గిరిజనుల్ని రక్షించడానికి.. రాహుల్ గాంధీ వ్యవసాయ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారని.. ఇందుకు తాము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, పెండింగ్లో ఉన్న లక్ష్యాలన్నీ తప్పకుండా నెరవేరుతాయని హామీ ఇచ్చారు.
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ముందు ఎన్నో లక్ష్యాలు ఉండేవని, నదుల నీళ్ళు పంట పొలాలకు పారుతాయని, రైతాంగ సోదరులు ఆత్మగౌరవంతో బతుకుతారని, సంపదంతా ప్రజలకు దక్కుతుందని సోనియా గాంధీ ఆశించారన్నారు. కానీ, ఎనిమిదేళ్ళయినా కృష్ణా నదిపై గానీ, గోదావరి నదిపై గానీ టీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పది లక్షల కోట్లు ఖర్చయ్యింది కానీ, ఒక్క ఎకరానికి నీళ్ళు అందలేదన్నారు. ఆ లక్ష్యాల్ని నెరవేర్చడానికే రాహుల్ గాంధీ నేనున్నానంటూ వచ్చారన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కదం తొక్కుతూ వచ్చిన రైతాంగ సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తన ప్రసంగాన్ని భట్టి విక్రమార్క ముగించారు.
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?