Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సంచలన ప్రకటన చేసేశారు. జియో ప్లాట్ఫార్మ్స్ (Jio Platforms) ఐపీఓ (IPO)కి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ‘డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్’ (DRHP)ను ఈ రోజే (శుక్రవారం) మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI)కి సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కీలక అడుగుతో దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఓ రియాలిటీగా మారబోతోంది.
భారత మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓ..
జియో ప్రతిపాదిత ఐపీఓ దేశంలోనే ఇప్పటివరకు రానటువంటి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవబోతోందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్ఎస్ఈ (NSE) ప్రతిపాదిత రూ.30,000 కోట్ల ఐపీఓ, హ్యుందాయ్ మోటార్ ఇండియాకు చెందిన రూ.27,870 కోట్ల ఐపీఓ రికార్డులను కూడా జియో అధిగమించనుందని టాక్. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.10 ఫేస్ వాల్యూ కలిగిన సుమారు 27 కోట్ల కొత్త షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తొలత ఆఫర్ ఫర్ సేల్ (OFS) మోడల్ను పరిశీలించినప్పటికీ, రిలయన్స్ చివరికి ‘ఫ్రెష్ ఇష్యూ’ వైపే మొగ్గు చూపింది. దీనివల్ల ఐపీఓ ద్వారా వచ్చే నిధులు నేరుగా జియో ఖాతాకే వెళ్తాయి. ఆ నిధులను వ్యాపార విస్తరణ, సరికొత్త టెక్నాలజీ, డిజిటల్ సేవల కోసం వినియోగిస్తారు. “ప్రపంచ స్థాయి సాంకేతిక కంపెనీలను నిర్మించడంలో భారత్ ఎంత సమర్థవంతమైనదో జియో లిస్టింగ్ ప్రపంచానికి చాటిచెబుతుంది” అని ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
లాభాల బాటలో జియో..
ఐపీఓ వస్తున్న తరుణంలో జియో ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ ప్రదర్శన ఎలా ఉందంటే.. కంపెనీ ఆపరేటింగ్ రెవెన్యూ 13% పెరిగి రూ. 44,928 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నెట్ ప్రాఫిట్ (నికర లాభం) 13% వృద్ధితో రూ.7,935 కోట్లుగా నమోదైంది. ARPU (సగటు ఆదాయం).. ప్లాన్ల ధరల పెంపుతో రూ.214కు పెరిగింది. ప్రతి కస్టమర్ నెలకు సగటున 42.3 GB డేటాను వాడుతున్నారు. ప్రస్తుతం జియోకు దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్, బ్రాడ్బ్యాండ్, క్లౌడ్ సేవలను జియో వేగంగా విస్తరిస్తోంది. 2020లోనే గూగుల్, మెటా, కెకెఆర్, సిల్వర్ లేక్, సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి ప్రపంచ దిగ్గజాలు జియోలో భారీ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి కళ్లు సెబీ ఇచ్చే అనుమతి, ఐపీఓ లాంచ్ టైమ్లైన్పైనే ఉన్నాయి.
- Tags
- Jio
- Jio Ipo
- Q4 profits
- ril agm
- SEBI
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!