Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grain Storage Silos: తెలంగాణ రాష్ట్రంలో ధాన్య కొనుగోలు, నిల్వ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ దిశగా సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్య నిల్వ వ్యవస్థల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను శాస్త్రీయంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో మంత్రి విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అత్యాధునిక సైలో టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. మొత్తం 82 సైలో టెర్మినల్స్ నిర్మాణం ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో భద్రపరిచే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 47.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
సైలో వ్యవస్థల ఏర్పాటు ద్వారా వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, తేమ, పురుగుల ప్రభావం వంటి సమస్యల నుంచి ధాన్యాన్ని రక్షించవచ్చని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ నిల్వ విధానాల కంటే సైలోలు అధునాతనంగా ఉండటంతో ధాన్యం నాణ్యతను ఎక్కువ కాలం పాటు పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్, వెదర్ప్రూఫ్ ప్యాడీ స్టోరేజ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని దీర్ఘకాలం భద్రంగా నిల్వ చేయడంతో పాటు అవసరానికి అనుగుణంగా సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
సైలోల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. సుమారు రూ.4,450 కోట్ల పెట్టుబడులతో ఈ భారీ ప్రాజెక్టును అమలు చేసే అవకాశాలపై అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పౌర సరఫరాల శాఖను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధునిక ధాన్య నిర్వహణ వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ధాన్యం నిల్వలో నాణ్యత ప్రమాణాలను కాపాడేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడం, నిల్వ సమయంలో జరిగే నష్టాలను గణనీయంగా తగ్గించడం, సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతాయని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!