Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grain Storage Silos: తెలంగాణ రాష్ట్రంలో ధాన్య కొనుగోలు, నిల్వ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ దిశగా సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్య నిల్వ వ్యవస్థల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను శాస్త్రీయంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో మంత్రి విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అత్యాధునిక సైలో టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. మొత్తం 82 సైలో టెర్మినల్స్ నిర్మాణం ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో భద్రపరిచే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 47.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
Also Read
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
సైలో వ్యవస్థల ఏర్పాటు ద్వారా వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, తేమ, పురుగుల ప్రభావం వంటి సమస్యల నుంచి ధాన్యాన్ని రక్షించవచ్చని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ నిల్వ విధానాల కంటే సైలోలు అధునాతనంగా ఉండటంతో ధాన్యం నాణ్యతను ఎక్కువ కాలం పాటు పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్, వెదర్ప్రూఫ్ ప్యాడీ స్టోరేజ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని దీర్ఘకాలం భద్రంగా నిల్వ చేయడంతో పాటు అవసరానికి అనుగుణంగా సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
సైలోల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. సుమారు రూ.4,450 కోట్ల పెట్టుబడులతో ఈ భారీ ప్రాజెక్టును అమలు చేసే అవకాశాలపై అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పౌర సరఫరాల శాఖను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధునిక ధాన్య నిర్వహణ వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ధాన్యం నిల్వలో నాణ్యత ప్రమాణాలను కాపాడేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడం, నిల్వ సమయంలో జరిగే నష్టాలను గణనీయంగా తగ్గించడం, సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతాయని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
-
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
-
Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
-
Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..