Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grain Storage Silos: తెలంగాణ రాష్ట్రంలో ధాన్య కొనుగోలు, నిల్వ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ దిశగా సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్య నిల్వ వ్యవస్థల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను శాస్త్రీయంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో మంత్రి విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అత్యాధునిక సైలో టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. మొత్తం 82 సైలో టెర్మినల్స్ నిర్మాణం ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో భద్రపరిచే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 47.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
Also Read
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
సైలో వ్యవస్థల ఏర్పాటు ద్వారా వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, తేమ, పురుగుల ప్రభావం వంటి సమస్యల నుంచి ధాన్యాన్ని రక్షించవచ్చని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ నిల్వ విధానాల కంటే సైలోలు అధునాతనంగా ఉండటంతో ధాన్యం నాణ్యతను ఎక్కువ కాలం పాటు పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్, వెదర్ప్రూఫ్ ప్యాడీ స్టోరేజ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని దీర్ఘకాలం భద్రంగా నిల్వ చేయడంతో పాటు అవసరానికి అనుగుణంగా సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
సైలోల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. సుమారు రూ.4,450 కోట్ల పెట్టుబడులతో ఈ భారీ ప్రాజెక్టును అమలు చేసే అవకాశాలపై అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పౌర సరఫరాల శాఖను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధునిక ధాన్య నిర్వహణ వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ధాన్యం నిల్వలో నాణ్యత ప్రమాణాలను కాపాడేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడం, నిల్వ సమయంలో జరిగే నష్టాలను గణనీయంగా తగ్గించడం, సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతాయని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!