Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
- పాక్పై ఆఫ్ఘన్ ‘మహా ప్రతీకారం’..
- సరిహద్దు దాటి డ్రోన్లతో భీకర దాడులు
- ఐసిస్ స్థావరాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghan: పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలపై ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తమ దేశంపై నిరంతరం జరుపుతున్న దాడులకు ఆఫ్ఘనిస్థాన్ ‘మహా ప్రతీకారం’ తీర్చుకుంది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద కేంద్రాలే లక్ష్యంగా ఆఫ్ఘన్ వైమానిక దళం (Afghan Air Force) డ్రోన్లతో విరుచుకుపడింది. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులలోని ఐసిస్ (ISIS), ఐసిస్-ఖొరాసన్ (ISIS-K) స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ఉమ్మడి కార్యాచరణ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఆఫ్ఘన్ ఇస్లామిక్ ఎమిరేట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
శత్రు గూఢచార సంస్థల అండతోనే కుట్రలు..
ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ‘X’ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. కొన్ని శత్రు దేశాల గూఢచార బృందాల సహాయంతో, ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి ఆఫ్ఘనిస్థాన్పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో ఆఫ్ఘన్ గడ్డపై జరిగిన పలు ప్రాణాంతక ఘోర దాడులకు ఇవే ప్రధాన కార్యాచరణ స్థావరాలుగా పనిచేశాయని రక్షణ శాఖ నిర్ధారించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నందుకే ఈ ముందస్తు దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ వైమానిక దళం ముందుగా నిర్ణయించుకున్న వ్యూహాత్మక లక్ష్యాలపై గురితప్పకుండా దాడులు చేసింది. ఆఫ్ఘన్ దళాలు ప్రధానంగా మూడు ప్రాంతాలను టార్గెట్ చేశారు.
Also Read
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
- Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
- Anupama Singh: "మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది".. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఖిలా అబ్దుల్లా జిల్లా (గులిస్థాన్ ప్రాంతం): ఇక్కడున్న ఐసిస్ ముఠాల ఉమ్మడి రక్షణ వలయాలపై డ్రోన్లు బాంబుల వర్షం కురిపించాయి.
చాగై జిల్లా (షకర్ అబ్ జంగల్ గార్డి ప్రాంతం): ఉగ్రవాదులు రవాణా, ఆయుధ నిల్వల కోసం ఉపయోగించే ప్రధాన స్థావరాలపై నిప్పులు కురిపించారు.
ఒరక్జాయ్ ఏజెన్సీ (కంబర్ ఖేల్ ప్రాంతం): ఇక్కడ ఉన్న ప్రమాదకరమైన ‘ఐసిస్-ఖొరాసన్’ (ISIS-K) ప్రధాన స్థావరంపై దాడి చేసి దాని వెన్ను విరిచారు.
దీంతో పాటు, ఉగ్రవాద ముఠాల కీలక నాయకులు తరచుగా రాకపోకలు సాగించే పఖ్తుంఖ్వా ప్రాంతాన్ని కూడా ఆఫ్ఘన్ దళాలు విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయి.
లక్ష్యాలు వంద శాతం విజయవంతం..
తాము నిర్దేశించుకున్న అన్ని ప్రధాన ఉగ్రవాద లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆఫ్ఘన్ సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్లో శత్రు మూకలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘన్ పాలకులు మాట్లాడుతూ.. “మా దేశ భద్రతకు, అంతర్గత స్థిరత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా ఇకపై సహించే ప్రసక్తే లేదు. ఎలాంటి ముప్పునైనా ముందే గుర్తించి, నిర్వీర్యం చేసి, పూర్తిగా నిర్మూలించడానికి మాకు అందుబాటులో ఉన్న అన్ని సామర్థ్యాలను, వనరులను వినియోగిస్తాం” అని పాకిస్థాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాజా దాడులతో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజీకి చేరాయి.
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!