Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
- పాక్పై ఆఫ్ఘన్ ‘మహా ప్రతీకారం’..
- సరిహద్దు దాటి డ్రోన్లతో భీకర దాడులు
- ఐసిస్ స్థావరాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghan: పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలపై ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తమ దేశంపై నిరంతరం జరుపుతున్న దాడులకు ఆఫ్ఘనిస్థాన్ ‘మహా ప్రతీకారం’ తీర్చుకుంది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద కేంద్రాలే లక్ష్యంగా ఆఫ్ఘన్ వైమానిక దళం (Afghan Air Force) డ్రోన్లతో విరుచుకుపడింది. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులలోని ఐసిస్ (ISIS), ఐసిస్-ఖొరాసన్ (ISIS-K) స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ఉమ్మడి కార్యాచరణ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఆఫ్ఘన్ ఇస్లామిక్ ఎమిరేట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
శత్రు గూఢచార సంస్థల అండతోనే కుట్రలు..
ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ‘X’ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. కొన్ని శత్రు దేశాల గూఢచార బృందాల సహాయంతో, ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి ఆఫ్ఘనిస్థాన్పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో ఆఫ్ఘన్ గడ్డపై జరిగిన పలు ప్రాణాంతక ఘోర దాడులకు ఇవే ప్రధాన కార్యాచరణ స్థావరాలుగా పనిచేశాయని రక్షణ శాఖ నిర్ధారించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నందుకే ఈ ముందస్తు దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. ఆఫ్ఘన్ వైమానిక దళం ముందుగా నిర్ణయించుకున్న వ్యూహాత్మక లక్ష్యాలపై గురితప్పకుండా దాడులు చేసింది. ఆఫ్ఘన్ దళాలు ప్రధానంగా మూడు ప్రాంతాలను టార్గెట్ చేశారు.
Also Read
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ప్రారంభం
- 900 Snakes Escape: పాముల పెంపక కేంద్రం మునిగి 900 నాగుపాములు బయటకు.. ప్రాణ భయంతో వణుకుతున్న ప్రజలు (వీడియో)
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
ఖిలా అబ్దుల్లా జిల్లా (గులిస్థాన్ ప్రాంతం): ఇక్కడున్న ఐసిస్ ముఠాల ఉమ్మడి రక్షణ వలయాలపై డ్రోన్లు బాంబుల వర్షం కురిపించాయి.
చాగై జిల్లా (షకర్ అబ్ జంగల్ గార్డి ప్రాంతం): ఉగ్రవాదులు రవాణా, ఆయుధ నిల్వల కోసం ఉపయోగించే ప్రధాన స్థావరాలపై నిప్పులు కురిపించారు.
ఒరక్జాయ్ ఏజెన్సీ (కంబర్ ఖేల్ ప్రాంతం): ఇక్కడ ఉన్న ప్రమాదకరమైన ‘ఐసిస్-ఖొరాసన్’ (ISIS-K) ప్రధాన స్థావరంపై దాడి చేసి దాని వెన్ను విరిచారు.
దీంతో పాటు, ఉగ్రవాద ముఠాల కీలక నాయకులు తరచుగా రాకపోకలు సాగించే పఖ్తుంఖ్వా ప్రాంతాన్ని కూడా ఆఫ్ఘన్ దళాలు విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయి.
లక్ష్యాలు వంద శాతం విజయవంతం..
తాము నిర్దేశించుకున్న అన్ని ప్రధాన ఉగ్రవాద లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆఫ్ఘన్ సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్లో శత్రు మూకలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘన్ పాలకులు మాట్లాడుతూ.. “మా దేశ భద్రతకు, అంతర్గత స్థిరత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా ఇకపై సహించే ప్రసక్తే లేదు. ఎలాంటి ముప్పునైనా ముందే గుర్తించి, నిర్వీర్యం చేసి, పూర్తిగా నిర్మూలించడానికి మాకు అందుబాటులో ఉన్న అన్ని సామర్థ్యాలను, వనరులను వినియోగిస్తాం” అని పాకిస్థాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాజా దాడులతో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజీకి చేరాయి.
తాజావార్తలు
-
Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్గా తీసే చిట్కాలు ఇవే..
-
Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్పై కేసు నమోదు!
-
Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!