Bhadrachalam: భద్రాచలం వద్ద 24 అడుగులకు చేరిన వరద నీరు.. అప్రమత్తమైన అధికారులు..
- భారీ వర్షాల వల్ల గోదావరికి చేరిన వరదనీరు..
- భద్రాచలం వద్ద 24 అడుగులు చేరిన గోదావరి వరదనీరు..
- భద్రాచలానికి వరదనీరు పెరిగే అవకాశంతో అధికారులు అప్రమత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrachalam: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి స్వల్పంగా వరద పెరిగింది. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద 24 అడుగుల వద్ద చేరుకొని ఉంది.. ఇది మరి కొంత పెరిగే అవకాశం కనబడుతుంది.మరోవైపున తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకి భారీ ఎత్తున నీళ్లు రావడంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు నీటి సామర్థ్యం 407 అడుగులు కాగా వరద ప్రభావం పెరుగు తుండటంతో ప్రస్తుతం 43 అడుగులకి చేరింది .దీంతో గత రాత్రి కిన్నెరసాని గేట్లని ఎత్తారు అదేవిధంగా తాలి పేరు ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయి నీటిమట్టం రావటంతో 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి విడుదల చేశారు.
Read also: Pakistan : భయపడిన పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లపై నిషేధం
Also Read
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
- CM Revanth Reddy : ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఇకపోతే నిన్న అశ్వరావుపేట వద్ద 16 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. ఇటీవల కాలంలో ఇక్కడ ఇంత పెద్ద వర్షం ఎప్పుడు పడలేదు భారీ వర్షం నమోదు కావడంతో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. పెదవాగు ప్రాజెక్టు నిండిపోయింది పెదవాగు ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీళ్లు చేరాయి. దీంతో మూడు గేట్లని పూర్తిగా వదిలినప్పటికీ బండు మీద నుంచి నేటి ప్రవాహం జరిగింది. ఇకపోతే పెదవాగు ప్రాజెక్ట్ పక్కనే ఉన్న నారాయణపురం వాగు పొంగింది. నారాయణపురం వాగులో అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో 50 మంది చిక్కుకొనిపోయారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు సమాచారం అందించడం తో స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అధికారులతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాలు రెండు హెలికాప్టర్ ని సంఘటన స్థలానికి పంపించారు. హెలికాప్టర్ ద్వారా 26 మందిని అదేవిధంగా ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ఎయిర్ బొట్ల ల ద్వారా 25 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా పెదవాగు ప్రాజెక్టుకి మూడు చోట్ల స్వల్పంగా గండిపడింది. అయితే గత రాత్రి నుంచి వర్ష ప్రభావం తగ్గటంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ముందస్తు నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజల్ని అధికారులు తరలించారు.
Hyderabad: మైనర్ బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల యువకుడిని అరెస్టు..
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!