Bandi Sanjay: రేపు వరంగల్ కు మోడీ.. అందరూ వచ్చి సభ సక్సెస్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు ప్రధాని మోడీ వరంగల్ వస్తున్నారని అందరూ వచ్చి సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగితా సమయంలో మోడిది అభివృద్ధి మంత్రమే అన్నారు. రైల్వే వ్యాగన్ మ్యాన్ ఫాక్చర్ యూనిట్, జాతీయ రహాదారులని ప్రారంభిస్తారని అన్నారు. అభివృద్ధి కొరకు రోడ్ల విస్తరణకి సహాకరించిన వారికి ధన్యవాదాలన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ రైల్వే ఆర్వోబి పనుల కొసం వందశాతం నిధులు కేంద్రం కేటాయించిందని తెలిపారు. రేపటి మోడి బహిరంగ సభకి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కరీంనగర్ జిల్లా కారాగారంలో గజ్వేల్ బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు. కార్యకర్తలను కలిసి జైలు నుంచి బయటికి వచిన సంజయ్ మాట్లాడుతూ.. గజ్వేల్ గొడవల కేసుతో కరీంనగర్ జైలులో ఉన్న 11 మంది నిందితులు కలిసానని అన్నారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్ లో శివాజీ విగ్రహం దగ్గర జరిగిన ఘటన అందరికి తెలుసు అని అన్నారు. ఈ ఘటనని నేను సమర్థిస్తున్న ..శివాజీ విగ్రహానికి అవమానం జరిగితే చూస్తూ ఉరుకోమన్నారు.
Read also: Falaknuma Express: ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు.. 5 బోగీలు పూర్తిగా దగ్ధం..
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
శివాజీ విగ్రహం దగ్గర మూత్రం పోస్తే లిక్కర్ బాటిల్ ఇస్తాం అంటూ బెట్టింగ్ కట్టారు కొందరు అని మండిపడ్డారు. అది తప్పు కాదా ? అని ప్రశ్నించారు. ఇక్కడ పార్టీలకి సంబంధం లేకుండా వ్యతిరేకించాల్సిన అంశం అని తెలిపారు. ఇంత చేసినవారిని పోలీసులు అరెస్ట్ చేయలేదు కానీ వీడియో తీసిన వారిని అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కార్యకర్తలపై సోడా బాటిల్స్ , బీర్ బాటిల్స్ తో దాడి చేసారని మండిపడ్డారు. ఒక కౌన్సిలర్ ఈ గొడవ ఆపే ప్రయత్నం చేసారని ఆరోపించారు. ఇక్కడ ఫిర్యాదు చేసినవారిపై, గొడవ ఆపేందుకు వెళ్లిన వారిపై కూడా పోలీసులు రివర్స్ కేసులు పెట్టారని మండిపడ్డారు. మసీద్ నుండి రెచ్చగొట్టి గొడవ చేసిన 30 మందిలో కేవలం ఆరుగురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహానికి అవమానం జరిగితే చూస్తూ ఊరుకునే స్థితిలో మేము లేమని అన్నారు. ఈ కేసులో అమాయకులపై నాన్ బేయిలబుల్ పెట్టాలని CMO నుండి పోలిసులపై ఒత్తిడి ఉందని అన్నారు. సీఎం నియోజకవర్గంలోనే శివాజీ విగ్రహానికి అవమానము జరిగింది. కేసీఆర్ ఈ విషయంపై స్పందించాలన్నారు.
Tomato Price: టమాటాకు రికార్డ్ ధర.. కిలోకి రూ. 250
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!