Nirudyoga March: వరంగల్లో బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’.. హాజరుకానున్న బండి సంజయ్
Nirudyoga March: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వరంగల్లో నిరుద్యోగ యాత్ర నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి నయీంనగర్, పెట్రోల్ పంప్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ దాదాపు 2 కిలోమీటర్ల మేర సాగనుంది.
17 షరతులు…
Also Read
- Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
17 షరతులు విధిస్తూ బీజేపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. రహదారికి ఒకవైపు మాత్రమే ర్యాలీ నిర్వహించాలి. ఈ ర్యాలీలో నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొననుండటంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ర్యాలీ ఏర్పాట్లను బీజేపీ నేతలు పూర్తి చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ యాత్ర నిర్వహణ కమిటీ సభ్యులు మూడు రోజులుగా వరంగల్ లోనే మకాం వేశారు. వరంగల్, హనుమకొండ నగరాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వరంగల్లోని యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల వద్ద నిరుద్యోగులకు పోస్టర్లు పంపిణీ చేసి నిరుద్యోగ యాత్రలో పాల్గొనాలని కోరారు. నిరుద్యోగ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కళాకారులు ఆయా కేంద్రాలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ ర్యాలీకి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. కాగా, ర్యాలీని విజయవంతం చేయాలని నిరుద్యోగ యాత్ర నిర్వహణ కమిటీ కన్వీనర్ గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిరుద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. త్వరలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ యాత్రలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 18న మహబూబ్ నగర్, 21న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!