Bandi Sanjay: పోలీసులతో బెదిరిస్తామనే నమ్మకంతో ఖమ్మం లీడర్లు ఉన్నారని.. బీఆర్ఎస్ పోటుగాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు కాక ముందే వారి చరిత్ర తెలుసని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వరంగల్లో నిరుద్యోగ యాత్ర నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు.