Bandi Sanjay: టీఆర్ఎస్ నేతల్ని డంపింగ్ యార్డ్ వద్దే కట్టేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Sensational Comments On CM KCR: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతల్ని డంపింగ్ యార్డ్ వద్దే కట్టేయాలని.. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దమ్మాయిగూడ ప్రసంగంలో ఆయన పిలుపునిచ్చారు. బీజేపీకి అధికారం ఇస్తే.. డంపింగ్ యార్డ్ సంగతి తేలుస్తామని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్.. మీకు మానవత్వం ఉంటే జవహర్ నగర్కు రావాలి’ అంటూ సవాల్ విసిరారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను కేసీఆర్ తనఖా పెట్టారని ఆరోపించిన బండి సంజయ్.. రోడ్లు కూడా వేయలేని దుస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. రూ.110 కోట్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు హామీ ఏమైందని ప్రశ్నించారు. భూకబ్జాలతో టీఆర్ఎస్ నేతలు కోట్లు దండుకున్నారని విమర్శించారు.
‘‘600 ఎకరాలను కబ్జా చేసుకోమంటే.. వెంటనే టిఆర్ఎస్ వాళ్లు వచ్చి ఆ డంపింగ్ యార్డ్ని కబ్జా చేసేసుకుంటారు. ఇక్కడ కొంతమంది నాయకులు జోకర్లుగా మారారు. డంపింగ్ యార్డ్, రోడ్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? బోడుప్పల్లో 7 వేల ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ లేదు. ఈ ప్రాంతంలో 100 పడగల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ లేదు. మోడీ ఇచ్చే పైసలను డైవర్ట్ చేసి, కమిషన్ల కోసం ట్రాక్టర్లను కొనిపిస్తున్నారు. అన్ని మాఫియాలకు కేంద్ర బిందువు టిఆర్ఎస్సే. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఎంతమంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు? ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం, నిరుద్యోగ భృతి వచ్చింది? దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? దళితులకు మూడెకరాలు, దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదు?’’ అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ పేదల సమస్యలను గాలికొదిలేసి, జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ దేశం పట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుంటే.. బిజెపి అంటేనే కెసిఆర్ గజగజా వణుకుతున్నాడని వ్యాఖ్యానించారు.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ను అభినవ అంబేద్కర్ అని కలెక్టర్ పొగడటమేంటని నిలదీశారు. ఆదివాసీ రాష్ట్రపతి అభ్యర్ధికి ఓటేయని కేసీఆర్.. గిరిజనకు రిజర్వేషన్లు ఇస్తామంటూ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందని.. ఉఫ్మని ఊదితే కూలిపోతుందని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు ఈడీ అంటే కొవిడ్.. సీబీఐ అంటే కాలు విరుగుతోందని సెటైర్లు వేశారు. పేదోళ్ల కోసమే సంవత్సరం నుంచి తాము పాదయాత్ర చేస్తున్నామన్నారు. కాగా.. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 7వరోజుకు చేరుకుంది. జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో ఆయన యాత్ర సాగుతోంది. దారి వెంట ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఆయన.. దమ్మాయిగూడ చౌరస్తాలో మాట్లాడారు. అక్కడ ప్రధానంగా ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించి తీరుతామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!