టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఒక సరికొత్త చిత్రం రాబోతోంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి చిత్రాలతో వెంకటేష్ నుంచి బెస్ట్ కామెడీని రాబట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు వీరిద్దరితో కలిసి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Hot Spot 2 : ‘హాట్ స్పాట్ 2 మచ్’.. వినోదానికి రెట్టింపు డోస్ అందించే కొత్త చిత్రం
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘వెంకటేష్, కళ్యాణ్ రామ్తో సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో ప్రేక్షకులకు నా నుండి కావాల్సిన వినోదంతో పాటు భారీ యాక్షన్ కూడా ఉంటుంది. వచ్చే సంక్రాంతి (2027) కి ప్రేక్షకులకు ఒక మంచి ప్యాకేజీతో ఈ సినిమాను అందించబోతున్నాం’ అని వెల్లడించారు. దీని బట్టి వెంకటేష్ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఇంటెన్సిటీకి అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ చాలా బాగా కలిసివచ్చింది, గతంలో ఆయన అందించిన సంక్రాంతి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్తో ఇద్దరు పెద్ద హీరోలను కలిపి పండుగ బరిలో దిగుతుండటంతో అటు నందమూరి అభిమానులు, ఇటు దగ్గుబాటి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.