Bandi Sanjay : ఏయ్ బిడ్డా….జూబ్లిహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా
- ఏయ్ బిడ్డా....జూబ్లిహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా
- కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీని గెలిపిస్తారు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే
- రెండు పార్టీలు కలిసి దోచుకుంటున్నాయి : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. “ఏయ్ బిడ్డా… జూబ్లిహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా” అంటూ ప్రారంభించిన ఆయన.. కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే అని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.. ఈ రెండు పార్టీల పాలనలో జూబ్లిహిల్స్ ప్రజలకు ఒరిగిందేమిటి? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని, అయితే హరీష్ రావు చెప్పగానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయన్నారు.
అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్కు మద్దతిస్తే, ఆయన తమ్ముడు బీఆర్ఎస్కు వత్తాసు పలుకుతున్నారని, బీజేపీని ఓడించడమే మజ్లిస్ పార్టీ ప్రధాన లక్ష్యమని సంజయ్ వ్యాఖ్యానించారు. “జూబ్లిహిల్స్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదు? ఈ రెండు పార్టీలతో చేసుకున్న బేరసారాలే నిదర్శనం” అని ఆయన అన్నారు. బీజేపీ గెలిస్తేనే కేంద్ర నిధులతో జూబ్లిహిల్స్ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. “కిషన్ రెడ్డి మరిన్ని నిధులు తెచ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తారు. కానీ కాంగ్రెస్ గెలిస్తే బంజారాహిల్స్ పెద్దమ్మతల్లి స్థలాన్ని మజ్లిస్కు ధారాదత్తం చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటారు” అని సంజయ్ ఎద్దేవా చేశారు.
Also Read
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
- OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
- Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
కాంగ్రెస్పై కోపంతో బీఆర్ఎస్కు ఓటేయడం అంటే రెండు పార్టీలకీ బలమిచ్చినట్లేనని అన్నారు. “బీజేపీని గెలిపించండి… ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పండి” అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచందర్ రావు, గౌతమ్ రావు, పాయల్ శంకర్ తదితర నేతలు హాజరయ్యారు.
Accident : నార్సింగిలో కారు బీభత్సం.. బాలుడిపై నుంచి దూసుకెళ్లిన కారు
తాజావార్తలు
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!