Bandi Sanjay: మోటార్లకు మీటర్లపై.. కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Challenges CM KCR On Meters For Motor: తెలంగాణ సీఎం కేసీఆర్కు మోటార్లకు మీటర్ల విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ సవాల్ విసిరారు. ‘‘రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మీకు లోన్ ఇవ్వండి అని కేంద్రానికి ఉత్తరం రాసింది నువ్వు కాదా? నువ్వు మగాడివి అయితే నిజం చెప్పు’’ అని ఛాలెంజ్ చేశారు. జయశంకర్ జిల్లాలో మంథనిలో ఆయన మాట్లాడుతూ.. విద్యాసాగర్ రావు సస్యశ్యామల యాత్ర చేపట్టారని, బీజేపీకి యాత్రలు కొత్త కాదు అని అన్నారు. ఆనాడు నక్సలైట్లు భయపెట్టినా, నేడు పోలీసులు భయపెడుతున్నా.. బీజేపీ యాత్రలు ఆగవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు కోట్లు సంపాదించుకున్నాడని ఆరోపణలు చేశారు. బీజేపీ పేరు చెప్పి సింగరేణిని కేసీఆర్ ప్రైవేటీకరణ చేస్తే.. గల్లా పట్టి కొడుతామని అన్నారు. సింగరేణి కేసీఆర్ సర్కారుకు ఏటీఎమ్ అయ్యిందన్నారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని ఆరోపించారు.
Case Of Husband Against Wife: అది మర్చిపోయిన భర్త.. శివాలెత్తిన భార్య.. కట్ చేస్తే..
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఇక కేటీఆర్ తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చారని, కేసీఆర్ పేరు పక్కకుపెడితే కుక్కలు కూడా కేటీఆర్ని చూడవని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను దేశం కోసం, ధర్మం కోసం జైలుకు వెళ్లినవాడినని.. సామాన్య కార్యకర్తగా ఎవరి అండదండలు లేకుండా ఎదిగానని అన్నారు. బీజేపీ కుటుంబాల పార్టీ కాదన్న ఆయన.. సామాన్య కార్యకర్త అయిన మోడీ ఇప్పుడు ప్రధాని అయ్యారన్నారు. ‘‘నీ కొడుకు, కూతురు కాకుండా వేరే వ్యక్తులను పార్టీ అధ్యక్షుడు చేసే ధైర్యం ఉందా’’ అంటూ కేసీఆర్కు మరో సవాల్ విసిరారు. కేసీఆర్వి అన్నీ దొంగ దీక్షలే అని.. ఉద్యమ సమయంలో తిని, తాగి దొంగ దీక్ష చేశాడని విమర్శించారు. ఢిల్లీలో చేసిన దీక్షలోనూ కేసీఆర్ మందు తాగారంటూ వ్యాఖ్యానించారు. ఒక తాగుబోతుని ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకున్నారంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని చెప్పారు.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది.. ఈ కాష్టం చల్లారదా?
పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని బండి సంజయ్ పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తోందన్నారు. కానీ, ఇవన్నీ తామే ఇస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని వాపోయారు. అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసును ప్రభుత్వం మూసి వేయాలని చూస్తోందని.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ కేసును రీ ఓపెన్ చేసి, హంతకులకు శిక్ష పడేలా చేస్తామని అన్నారు. కవితకు దొంగసారా వ్యాపారం చేయడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు మాత్రం డబ్బులు లేవా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Harmanpreet Kaur: రనౌట్ వివాదం.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్కు హర్మన్ కౌంటర్
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!