CM Jagan: నేడు హైదరాబాద్ కు ఏపీ సీఎం.. కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. నేటి ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ రానున్న జగన్, అక్కడి నుంచి హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. ఉదయం 11:30 గంటలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించనున్న వైఎస్ జగన్. గత నెల 8వ తేదీన కేసీఆర్ గజ్వేల్ ఫాంహౌజ్లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు. కొద్దికాలం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Read also: Cock Fightings: కోడి పందాలు.. జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్
Also Read
- Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
- KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నాయకులు, బీఆర్ఎస్ నేతలు ఆయనను పరామర్శించారు. అనంతరం కేసీఆర్ బంజారాహిల్స్లోని నందినగర్లో గల ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. అక్కడే కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేటీఆర్కు ఫోన్ చేసిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు సీఎం జగన్. కాగా ఇవాళ సీఎం జగన్ నేరుగా వెళ్లి పరామర్శించనున్నారు. కేసీఆర్ ఇంటికి వెళ్తున్న జగన్ లంచ్ మీటింగ్కు హాజరవుతారని సమాచారం.
Read also: IND vs SA: ఏడాది తర్వాత టాప్-10లోకి విరాట్ కోహ్లీ!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గతేడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి జారిపడటంతో ఎడమ తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. అనంతరం సీనియర్ వైద్యులు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేసీఆర్కు సూచించారు. డిసెంబర్ 15న కేసీఆర్ డిశ్చార్జ్ కావడంతో వైద్యులు ప్రతిరోజూ నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
Cock Fightings: కోడి పందాలు.. జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!