Ap-TS Temperatures: 41.8 డిగ్రీలతో మండిపోతున్న తెలుగు రాష్ట్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భానుడి భగభగతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే చనిపోతున్నారు. మరో ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్లోనూ ఎండ ప్రభావం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ రోజువారీ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పెరిగాయి. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇబ్బందిగా మారింది.
Read also: CSK vs SRH: ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడమే మా ఓటమికి కారణం కాదు: ప్యాట్ కమిన్స్
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
గ్రేటర్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలు, గాలిలో తేమ 24 శాతంగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మధ్యాహ్న సమయంలో ఎండలు మండుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. పనులు కూడా సాయంత్రం లేదా రాత్రికి వాయిదా పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ పగటిపూట నిర్మానుష్యంగా మారి సాయంత్రం వేళ రద్దీగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Read also: Gun Fire : ఫ్లోరిడాలో ఒక పార్టీలో 16 ఏళ్ల బాలుడు కాల్పులు.. పదిమందికి గాయాలు
దక్షిణాది నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ లో ఉక్కపోత పొంగిపొర్లుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎండలు ఎక్కువగా ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వచ్చి ఉదయం, సాయంత్రం పనులు చేయవద్దని చెబుతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాల్సి వస్తే మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి ఉంచుకుని తరచూ నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!