Anand Mahindra : సీఎం రేవంత్ రెడ్డిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
- ఎంత డిజిటల్ అయినా.. ఎంత ఏఐ వచ్చినా.. హ్యూమన్ టచ్కు ఉన్న ప్రాథాన్యత వేరు
- ఆ స్కిల్ను భర్తీ చేయడం ఎవరితరం కాదు.
- విజన్ డాక్యుమెంట్ చూసాక.. టార్గెట్ పెద్దగా ఉండాలని నిర్ణయించుకున్నా
- నాలుగు దశాబ్దాల వ్యాపారవేత్తగా ఉన్న నాకు.. రేవంత్ ఓ సమ ఉజ్జీలా కనిపించారు : మహీంద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra : భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ విజయవంతంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమ్మిట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి దిశ, విజన్ డాక్యుమెంట్ ఆయనను బాగా ఆకట్టుకుందని వెల్లడించారు.
సమ్మిట్ వేదికపై మాట్లాడిన ఆనంద్ మహీంద్రా… టెక్నాలజీ ఎంత వేగంగా ఎదిగినా, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత విస్తరించినా హ్యూమన్ టచ్కు ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదన్నారు. మానవీయ నైపుణ్యాన్ని ఏ సాంకేతికత భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా హ్యూమన్ స్కిల్స్కు కీలక పాత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు.
Also Read
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- OTR : కవిత కొత్త పార్టీకి టిఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా.. పార్టీ పేరు మారుతుందా?
- Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
- OTR : గ్రేటర్ ఎన్నికలపై BJP టెన్షన్..? కాంగ్రెస్ వ్యూహాలపై కమలం అప్రమత్తం!
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను పరిశీలించిన తర్వాత లక్ష్యాలను మరింత విస్తృతంగా, పెద్ద స్థాయిలో పెట్టుకోవాలని అనిపించిందని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఆ డాక్యుమెంట్ను చూస్తే నిపుణుల అభిప్రాయాలు మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రజల ఆశయాలు కూడా ప్రతిబింబించినట్లు అనిపించిందన్నారు. యువత, మహిళలు, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలు సమతుల్యంగా ఇందులో పొందుపరిచినట్లు ప్రశంసించారు.
ఇంత స్పూర్తిదాయకమైన విజన్ డాక్యుమెంట్ను రూపొందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్పష్టమైన దిశ, ధైర్యమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తున్న నాయకత్వం తెలంగాణలో కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. జహీరాబాద్లో మహిళలు నిర్వహిస్తున్న బ్యాటరీ తయారీ పరిశ్రమ తమకు గర్వకారణమని ఆనంద్ మహీంద్రా చెప్పారు.
మహిళా సాధికారత, పారిశ్రామిక అభివృద్ధి రెండూ కలిసొచ్చేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. నాలుగు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్న తన అనుభవంతో చూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఒక సమఉజ్జీలా కనిపిస్తున్నారని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో ఈ తరహా నాయకత్వం కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Duddilla Sridhar Babu : భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!