Amit Shah and JP Nadda: బీహార్లో అమిత్షా.. పదేపదే తెలంగాణ ప్రస్తావన..! ఏంటి విషయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్షా.. తన బీహార్ పర్యటనలో పదే పదే తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చారు.. పాట్నాలో జరిగిన వివిధ మోర్చాల జాతీయ సమావేశాల్లో పాల్గొన్న షా.. తెలంగాణ బీజేపీ శాఖ చేస్తున్న పోరాటాలను ప్రస్తావించారు… తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, ఉద్యమాలను అమిత్షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పదే పదే ప్రస్తావించారు. తెలంగాణలో చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పనిచేయాలని పిలుపునిచ్చారు.. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న పేర్కొన్నారు అమిత్షా..
Read also: Raja Singh: యోగి కాళ్ళు నొక్కండి..! సీఎం గారు.. కొద్దిగా గైడెన్స్ వస్తుంది..
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
బీహార్ రాష్ట్రం పాట్నాలో నాలుగు రోజుల పాటు అంటే జులై 28 నుండి 31వ తేదీ వరకు వివిధ మోర్చాల జాతీయ సంయుక్త సమావేశాలు జరిగాయి.. ఈ సమావేశాలకు హాజరైన అమిత్షా, జేపీ నడ్డా.. తెలంగాణలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఇటీవల జాతీయ నాయకులు రెండు రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావించారు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను పదేపడే ప్రస్తావించారు అగ్రనేతలు, తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలను పలుమార్లు ప్రస్తావించడంతో చపట్లతో హర్షం వ్యక్తం చేశారు వివిధ మోర్చాలకు చెందిన తెలంగాణ నాయకులు.. బీహార్లో రెండోసారి విజయవంతంగా అధికారంలోకి వచ్చిన విషయాన్ని కూడా సమావేశంలో పేర్కొన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జెండా పాతేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ.. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహించడం.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగసభ నిర్వహించి సత్తా చాటారు.. సభ వేదికపై నుంచి జనాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోడీ.. బండి సంజయ్ని అభినందించిన విషయం తెలిసిందే.. ఇక, గత రెండు మూడు పర్యటనల్లోనూ.. బీజేపీ తెలంగాణ చీఫ్పై ప్రశంసల వర్షం కురిపించారు అమిత్షా.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!