Ganesh Chaturdi: ఈసారి భారీగా మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి అంటే హైదరాబాద్ అందరికీ గుర్తుకు వస్తుంది. ఈసారి వినాయక చతుర్థి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరగనున్నాయి. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల పై సమావేశం జరిగింది. జూబ్లిహిల్స్ లోని MCRHRD లో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, MLC ప్రభాకర్ రావు, MLA దానం నాగేందర్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
Read Also: Loan Apps New Cheating: అకౌంట్లో డబ్బులు వేస్తారు.. చీటర్ అనే ముద్రతో వేధింపులు
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల31 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల కోసం వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. విగ్రహాల ఊరేగింపు నిర్వహించే అన్ని రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఈసారి ప్రజల్లో మట్టి విగ్రహాల ప్రాధాన్యతను మరింతగా తెలియచేసేందుకు మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ ఎక్కువగా చేపట్టనున్నారు. GHMC ఆధ్వర్యంలో 4 లక్షలు, HMDA ఆధ్వర్యంలో ఒక లక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక లక్ష మట్టి విగ్రహాల పంపిణీ చేపడతారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడతాం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.
మరోవైపు హైదరాబాద్ లో గణేష్ చతుర్థి అంటే ఖైరతాబాద్ గణేశుడే గుర్తుకువస్తాడు. ఈసారి కూడా 50 అడుగుల మేర వినాయకుడు కొలువు తీరనున్నాడు. గతంలో నెలరోజుల ముందే ఈ లంబోదరుడి పనులు అన్నీ పూర్తయ్యేవి. కానీ ఈసారి వరుణుడి దెబ్బకు పనులు పెండింగ్ లో పడ్డాయి. గతానికి భిన్నంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి బదులుగా మట్టి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. సమయం దగ్గరపడుతుండడంతో పనులు వేగవంతం చేస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది పంచముఖ లక్ష్మీగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఆ పార్వతీ తనయుడు.
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!