Nagoba Jatara: రేపటి నుంచి నాగోబా జాతర.. పటిష్ట బందోబస్తు
- రేపటి నుంచి నాగోబా జాతర
- రేపు రాత్రి నాగోబాకు మహాపూజ చేయనున్న మెస్రం వంశీయులు
- ఫిబ్రవరి 4 వరకు జరగనున్న కేస్లాపూర్ నాగోబా జాతర
- నాగోబా జాతరకు భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి నాగోబా జాతర మొదలవనుంది. మంగళవారం రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. కాగా.. కేస్లాపూర్ నాగోబా జాతర రేపు రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. రేపు మెస్రం వంశస్థులు పవిత్ర గోదావరి జలాన్ని కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొచ్చి.. నాగోబాను అభిషేకిస్తారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. మరోవైపు.. నాగోబా జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. నాగోబా జాతర సందర్భంగా భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర నాగోబా అని అన్నారు. నాగోబా జాతరకు రాష్ట్రం నుంచి కాకుండా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు.
Read Also: Champions Trophy 2025: రేపటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫి టికెట్లు విడుదల.. టీమిండియా ఫ్యాన్స్ కు షాక్!
Also Read
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ - ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!
- Balka Suman: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే..
- RTC Bus: బ్రిడ్జి పై నుంచి కింద పడిన ఆర్టీసీ బస్సు.. 25 మంది ప్రయాణికులు..!
రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో జరిగే నాగోబా జాతరకు.. పోలీస్ శాఖ పూర్తి సంసిద్ధతతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ తెలిపారు. స్థానిక నాగోబా దర్బార్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. మెస్రం వంశీయులు సాంప్రదాయాలు నడుము పండగను జాతరను నిర్వహిస్తారని వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. జాతర బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి నిత్యవసర వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్టును అందజేశారు. జాతర మొత్తాన్ని ఆరు సెక్టార్లుగా విభజించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని, తమకు కేటాయించిన స్థలాలలో మూడు షిఫ్టుల నందు సిబ్బంది ఎల్లవేళలా హాజరుతో ఉంటూ విధులను నిర్వర్తించాలని సూచించారు.
Read Also: Nandamuri Balakrishna: బాలకృష్ణని ఘనంగా సన్మానించిన ‘అఖండ 2: తాండవం’ టీం
తాజావార్తలు
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!