తెలంగాణ సంపదపై ఆశతోనే పాదయాత్రలు: గుత్తా సుఖేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రతిపక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ సంపద మీద ఆశతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రగతిపథంలో దేశంలోనే అగ్రభాగంలో ఉందని.. దీన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. కొన్ని పార్టీలు పాదయాత్రల పేరుతో తెలంగాణను, సీఎం కేసీఆర్ ను అపఖ్యాతి చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆశతో ఉన్నోడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు.. ఆశయంతో ఉన్నవారికి అధికారమిస్తే అభివృద్ధి చేస్తారని దానికి నిదర్శనమే కేసీఆర్ అని చెప్పారు. గతంలో కుట్రలు, కుతంత్రాలతో అధికారమే పరమావధిగా కొందరు నేతలు ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇక, రాయలసీమ డీఎన్ఏ ఉన్న షర్మిల సైతం ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు గుత్తా.. తెలంగాణ గురించి షర్మిలకు ఏం తెలుసుని ప్రశ్నించిన ఆయన.. ఏపీలో అవకాశం లేక షర్మిల తెలంగాణపై పడ్డారని ఆరోపించారు. రైతులకు కష్టాలు లేకుండా చేయడానికి రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారన్నారు. హుజూరాబాద్ బై పోల్ లో.. గెల్లు శ్రీనివాస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని, అడ్డదారుల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఈసీ, పారా మిలటరీ దళాలు అడ్డు పెట్టుకొని గెలవాలని బీజేపీ చేస్తోందని, పశ్చిమ బెంగాల్లో చేసినట్లు ఇక్కడ చేద్దామంటే కుదరదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సౌమ్యుడిగా పేరున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వానికి.. పెట్రోలు, డీజిల్ ధరలను కట్టడి చేసే ఆలోచనే లేదన్నారు. రోజురోజుకీ పెరుగుతోన్న నిత్యావసర ధరలతో సామాన్యుడిపై పెనుభారం పడుతుందన్నారు. బియ్యం కొనుగోలులో కేంద్రం మొండి వైఖరితో ఉన్నా.. ధాన్యం కొనుగోలుకు కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇకనైనా ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!