Rajanna Sirisilla: విషాదం.. 140 ఆవులు మృతి..! మరో 89 అదృశ్యం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం అతలాకుతంలమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద నీరు రావడంతో గ్రామాలు, జిల్లాలు, మండలాలు జలమయమయ్యాయి. ఇండ్లలో నీరు చేరి జనం అవస్థలు ఎదుర్కొంటుంటే మరో పక్క నిలవ నీడలేక వర్షానికి ఇండ్లు నేలమట్టమై ప్రజలు భయాందోళనతో ప్రాణాలు అరిచేతిపెట్టుకుని బిక్కు బిక్కు మంటు కాలం గడుపుతున్నారు. మరొకొన్ని చోట్లు ప్రజలు నీల్లలో కొట్టికుపోయిన దాఖలాలు వున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. వర్షానికి ప్రజలే కాదు.. జంతువులు కూడా మృత్యువాత పడ్డాయి. మేతకు వెళ్లిన ఆవులు మృతి చెందడంతో.. బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది.
read also: Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. రేపు అఖిలపక్ష భేటీ
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. రోజులాగే అడవికి మేతకు వెళ్ళిన 140 ఆవులు విగతజీవులుగా మారాయి. అయితే వారితోపాటు వెళ్లిన మిగతా 89 ఆవుల దొరకడం లేదు. ఈఘటన వీరపల్లి మండలం మద్దిమల్ల, రుద్రంగి మండలం డేగావాత్ తండాలో శుక్రవారం జరగడంతో అందరిని కలిచివేస్తోంది. అయితే.. మద్దిమల్లతండాకు చెందిన 23 మంది రైతులకు సంబంధించిన 129 ఆవులను మూడు రోజుల క్రింతం సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. చీకటి పడినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన వారు వార్షం కురుస్తున్నా లెక్కచేయకుండా వెతకడానికి వెళ్లారు. కొద్ది దూరంలో 80 ఆవులు మృతి చెందగా మరో.. 49 ఆవుల కోసం గాలిస్తున్నారు. అయితే రుద్రంగి మండలం దేగావత్ తండా, కున్సోత్ తండా, జోత్యతండాలకు చెందిన వంద ఆవుల్లో 60 మృత్యువాత పడగా.. మరో 40 ఆవుల ఆచూకీ దొరకడం లేదు, దీంతో బాధితులు కన్నీమునీరయ్యారు. ఆవులన్నీ మృతి చెందడానికి గల కారణం శరీర ఉష్ణోగ్రత తగ్గడంతోనే అని పశువైద్యాధికారులు పేర్కొన్నారు. ఆవులు కోల్పోయి మిగతా ఆవులు కనిపించకుండా పోవడంతో.. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Krishna River Management Board: తెలుగు రాష్ట్రాలకు లేఖ అనుమత్తుల్లేని వాటిని ఆపండి..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!