Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. రేపు అఖిలపక్ష భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఈ నెల 18వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఇక, ఆదే రోజు రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగోబుతున్నాయి.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్న నేపథ్యంలో.. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి.. ఇదే, సమయంలో.. వారిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది అధికార పక్షం.. ఇక, ఈ సారి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు… అయితే, పార్లమెంటు సభ్యుల నోరు నొక్కేలా కొన్ని పదాలపై నిషేధం విధించారని విపక్షాలు మండిపడుతున్నాయి.. పార్లమెంటు ఆవరణలో ఎంపీలు ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేయకూడదంటూ మరో నిరంకుశ చర్యకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అన్పార్లమెంటరీ పదాల బుక్లెట్ను తాజాపరిచే పేరుతో మరో 65 పదాలను నిషేధిత జాబితాలో చేర్చుతూ గురువారం లోక్సభ ఒక గ్యాగ్ ఆర్డర్ను జారీ చేసింది.. ఇక, శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ.. పార్లమెంటు ఆవరణలో ధర్నాలు, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేయరాదంటూ మరో నిషేధం విధించారు. దీనిపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి..
Read Also: Krishna River Management Board: తెలుగు రాష్ట్రాలకు లేఖ అనుమత్తుల్లేని వాటిని ఆపండి..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
ఇక, పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర నిర్ణయించింది.. ఇక, అదే రోజు మధ్యాహ్నం ప్రతిపక్షాలు భేటీ కానున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆయా సభల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కాబోతున్నారు.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆదివారం వివిధ పార్టీల ఫ్లోర్లీడర్లతో సమావేశం కాబోతున్నారు.. గ్యాస్ ధర పెంపు, రూపాయి పతనం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి అంశాలను లేవనెత్తడానికి విపక్షాలు సిద్ధం అవుతుంటే.. వారిని కట్టడి చేయడంపై అధికారపక్షం ఫోకస్ పెట్టింది..
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!