NASA: చంద్రుడిపై మైనింగ్ చేయాలని నాసా ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA: భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడిపై గత దశాబ్ధాలుగా పలు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులో అన్నింటి కన్నా ముందు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ ఉంది. అయితే ఇప్పుడు నాసా చంద్రుడిపై మైనింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. వచ్చే పదేళ్లలో చంద్రుడిపై మైనింగ్ ప్రారంభించాలని నాసా భావిస్తున్నట్లు గార్డియన్ తన నివేదికలో పేర్కొంది. 2023 నాటికి చంద్రుడి ఉపరితలాన్ని తవ్వాలని యోచిస్తోంది.
ఇప్పటికే నాసా తన ప్రతిష్టాత్మకమైన ఆర్టెమిస్ మిషన్ ద్వారా 2025 నాటికి చంద్రుడిపై మనుషులను పంపేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ వార్త వచ్చింది. చంద్రుడిపైకి మానవులను చివరిసారిగా నాసా 1972లో చివరిసారిగా అపోలో 17లో తన వ్యోమగాముల్ని పంపింది. ఆ తరువాత ఇప్పుడే ఆర్టిమిస్ ద్వారా వ్యోమగాముల్ని పంపబోతోంది. ఈ మిషన్ ద్వారా మొదటిసారిగా ఓ మహిళను చంద్రుడిపైకి తీసుకెళ్లబోతున్నారు. చంద్రుడి నేలకు పదార్థాలను సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ ప్లంట్ ను ఏర్పాటు చేసే ప్లాన్ తో ఒక టెస్ట్ డ్రిల్ ను అంతరిక్షంలో పంపుతుంది.
Also Read
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
Read Also: Tamil Nadu: గవర్నర్ సంచలన నిర్ణయం.. సీఎంకి చెప్పకుండానే క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీ తొలగింపు..
ప్రస్తుతం తాము చంద్రుడిపై వనరులను అర్థం చేసుకోవడానికి, అణ్వేషించడానికి ప్రయత్నిస్తున్నామని నాసా శాస్త్రవేత్త గెరాల్డ్ శాండర్స్ ను ఉటంకిస్తూ ది గార్డియన్ పేర్కొంది. వాణిజ్య రాకెట్ కంపెనీలు ఇంధనం లేదా ఆక్సిజన్ నింపుకునేందుకు చంద్రుడి ఉపరితలాన్ని మొదటగా వాడే అవకాశం ఉందని రాయిటర్స్ తెలిపింది. చంద్రుడిపై ఎందుకు మైనింగ్ చేయాలని భావిస్తుందో..‘‘లూనార్ గోల్డ్ రష్’’ ఎలా పనిచేస్తుందనే వివరాలను నాసా తన వెబ్సైట్ లో 2015లో ప్రచురించింది. నాసా చంద్రుడిపై నీరు, హీలియం, రేర్ ఎర్త్ మెటల్స్ కోసం అణ్వేషిస్తోంది.
నీటిని రాకెట్ ఇంధనంగా మార్చగలిగితే, న్యూక్లియర్ ఫ్యూజన్ వంటి శక్తి రంగం అభివృద్ధిలో హీలియం సహాయపడుతుందని నాసా తెలిపింది. చంద్రుడిపై కనిపించే అరుదైన లోహాలైన స్కాండియం, యట్రియం ఆధునిక ఎలక్ట్రానిక్స్ రంగానికి మరింతగా ఉపయోగపడుతాయి. ఈ రెండు మూలకాలు చంద్రుడి శిలల్లో అధిక సాంద్రతతో ఉన్నాయి. చంద్రుడిపై ప్రతిరోజూ దాని నుండి 1 మెట్రిక్ టన్ను త్రవ్విస్తే, చంద్రుని ద్రవ్యరాశిలో 1 శాతం తగ్గడానికి 220 మిలియన్ సంవత్సరాలు పడుతుందని నాసా తెలిపింది.
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!