CM Chandrababu : ఈ నెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు
- అమరావతి పునఃప్రారంభానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన
- ప్రధాని మోదీతో భేటీ – కీలక అంశాలపై చర్చ
- అమరావతి అభివృద్ధికి నిధులు – బ్యాంకుల ముందుకువచ్చిన ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఈ నెల 18న ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా అమరావతి రాజధాని (Amaravati) అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోడీని అధికారికంగా ఆహ్వానించాలని టీడీపీ (TDP) వర్గాలు భావిస్తున్నాయి.
అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని అర్థాంతరంగా నిలిపివేయడంతో వేలాది మందికి నష్టమైంది. అయితే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. నిర్మాణ పనుల కొరకు ప్రపంచ బ్యాంక్ (World Bank) సహా అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
ఇటీవలే రెండు ప్రతిష్టాత్మక బ్యాంకులతో పాటు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) కూడా అమరావతి అభివృద్ధికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
సీఎం చంద్రబాబు ఈ పర్యటనలో ప్రధాని మోడీతో పలు కీలక విషయాలను చర్చించనున్నారు. అందులో ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ, కేంద్రం నుంచి మద్దతు, అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధుల మంజూరు వంటి అంశాలు ఉండనున్నాయి. అమరావతిలో రహదారుల అభివృద్ధి, ల్యాండ్ పూలింగ్ విధానం, ప్లాట్ల వినియోగం, ప్రధాన హైవేలకు కనెక్టివిటీ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
ముఖ్యంగా అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందించాలనే విషయాన్ని చంద్రబాబు ప్రధానితో ప్రస్తావించనున్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి గతంలో జరిగిన అవాంతరాలను వివరించి, ఇకపై కేంద్ర సహకారంతో పనులను ముందుకు తీసుకెళ్లేలా ఒక క్లియర్ బాటలో నడవాలని నిర్ణయించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అమరావతి పనులను ప్రధానితో కలిసి పునఃప్రారంభించాలని సూచించాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు మోడీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. ప్రధానిని నిర్మాణ స్థలానికి ఆహ్వానించడానికి టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమరావతి అభివృద్ధిపై కేంద్రం నుంచి అనుకూల నిర్ణయాలు తీసుకుంటే, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనను టీడీపీ నేతలు చాలా ప్రాముఖ్యతనిచ్చి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎంపీలు ఈ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి, గృహ మంత్రి తదితర కీలక నేతలతో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనుల గురించి చర్చించనున్నారు.
ఢిల్లీలో జరిగే ఈ భేటీలు అమరావతికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రధానితో చర్చల అనంతరం రాష్ట్రంలో అమరావతి పనులు మరింత వేగంగా జరిగే అవకాశముంది. ప్రజలందరికీ ఆతృతగా ఎదురుచూస్తున్న అమరావతి నిర్మాణ పనులు మరోసారి కొత్త దిశగా సాగేలా ఈ భేటీ కీలక మలుపుగా మారనుంది.
Mohan Lal : మార్చి 27న థియేటర్లలోకి మోహన్ లాల్ ‘L2 ఎంపురాన్’..
తాజావార్తలు
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!