క్యాన్సర్తో పోరాడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ఇద్దరూ ఫోన్లు చేసి నాలో ఆత్మవిశ్వాసం నింపారు అన్నాడు. క్యాన్సర్ నుంచి బయటికి వచ్చేసరికి టీమ్లో చాలా మార్పులు వచ్చాయి. ధోనీ టీమ్లో నా ప్రాధాన్యం తగ్గింది. అది వ్యక్తిగతం నన్ను చాలా బాధపెట్టింది.. అంటూ యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు.
Gautam Gambhir Says India did not get World Cups because of MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. ధోనీ వల్ల 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లు భారత్ గెలుచుకోలేదని.. ప్లేయర్స్ అందరూ సమష్టిగా రాణించడంతోనే ట్రోఫీలు దక్కాయన్నాడు. ధోనీ పీఆర్ ఏజెన్సీ అతన్ని పెద్ద హీరో చేసిందని, నిజానికి రెండు మెగా టోర్నీల్లో భారత్…
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంపై క్రీడాకారులు స్పందించారు. ఈ దారుణమైన ఘటనను చూస్తుంటే తీవ్ర వేదన కలుగుతోందని ట్వీట్లు చేశారు.
బ్రియాన్ లారాని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించి, యువరాజ్ సింగ్కి సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్గా బాధ్యతలు ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. యువీ ఎస్ ఆర్ హెచ్ హెడ్ కోచ్ గా వస్తే.. దేశవాళీ కుర్రాళ్ల నుంచి అదిరిపోయే పర్పామెన్స్ రాబడతాడని హైదరాబాద్ అభిమానులు అంటున్నారు.
ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో నెలకొల్పబడిన ప్రతిష్టాత్మకమైన మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మరో నలుగురు ప్రముఖ భారత అంతర్జాతీయ ఆటగాళ్లకు బుధవారంనాడు 'లైఫ్ మెంబర్షిప్' ఇచ్చింది.
Yuvaraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా గోవాలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆన్లైన్లో ప్రకటన ఇవ్వడంతో గోవా అధికారులు అతనికి నోటీసులు అందజేశారు.
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చేశాడు. గురువారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి రోహిత్ సత్తా చాటుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ అగ్రస్థానానికి చేరాడు. గతంలో ఈ రికార్డు యువరాజ్ పేరిట ఉండేది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ 34 సిక్సర్లు కొట్టగా…
Yuvraj Singh: సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలనం సృష్టించాడు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై ఆకాశమే హద్దుగా యువరాజ్ చెలరేగిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. పురుషులు టీ20 మ్యాచ్లో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా యువీ రికార్డులకెక్కాడు. అతడి వీర బాదుడుకు బ్రాడ్ బిక్కమొహం వేశాడు. అంతకుముందు ఓవర్లో ఫ్లింటాఫ్తో గొడవ కారణంగా…
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా.. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. ఒకే మ్యాచ్లో అర్థశతకం సాధించడంతో పాటు మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు 2009-10లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే 60 పరుగులు చేయడంతో పాటు 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు…
ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ను చూస్తే పాపం అని టీమిండియా అభిమానులు అనక మానరు. ఎందుకంటే గతంలో టీ20 ప్రపంచకప్లో బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టి అతడికి యువరాజ్ సింగ్ నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఇప్పటికీ ఆ ఓవర్ను అటు ఇంగ్లండ్ అభిమానులు, ఇటు టీమిండియా అభిమానులు మరిచిపోలేరు. తాజాగా బర్మింగ్ హామ్ టెస్టులో బ్రాడ్ బౌలింగ్లోనే ఒకే ఓవర్లో బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక…