వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు సినీ నిర్మాత బండ్ల గణేష్.. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.. మీకు కులం నచ్చకుంటే, కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టoడి. కానీ, చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి అని సలహా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు అని…
కడప జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ఆర్ తనకు దేవుడు లాంటి వారని.. అందుకే ఆయన ఆశీస్సుల కోసమే ఇడుపులపాయ సందర్శనకు వచ్చినట్లు వివరించారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని మంత్రి రోజా పేర్కొన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని వైఎస్ఆర్ ఆహ్వానించారని.. కానీ అప్పుడు కుదరలేదని.. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ మీద…
మంత్రి కావాలని అనుకున్న ఆ ఎమ్మెల్యే ఆశలు ఆడియాసలు అయ్యాయి. రెండుసార్లు ఆయన పేరు ప్రస్తావనకు వచ్చినా.. చివరిక్షణంలో ఛాన్స్ మిస్. దీనికంతటికీ ఆయన రాజకీయ గురువే కారణమని చెవులు కొరుక్కుంటున్నారట. శిష్యుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని టాక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎవరా గురువు? చివరి వరకు రేస్లో.. లాస్ట్లో ఛాన్స్ మిస్ కోనసీమ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ముమ్మిడివరం. ఇక్కడి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు పొన్నాడ సతీష్కుమార్. మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి…
కేబినెట్లో ఆయనకు రెండోసారి ఛాన్స్ దక్కింది. అవకాశం ఇచ్చినా ఒకే.. లేకపోయినా డబుల్ ఓకే అన్నట్టుగా వ్యవహారం నడిచింది. ఒకానొక సమయంలో తెరవెనక మంత్రాంగం నడిచినా.. ఆయన మరోలా నరుక్కొచ్చారని తాజాగా చర్చ జరుగుతోంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అదా.. కథ అని నోరెళ్ల బెడుతున్నారట. ఇంతకీ ఎవరా మంత్రి? సీఎం జగన్కు సన్నిహితం ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఏపీ కేబినెట్లో రెండోసారి కూడా చోటు దక్కించుకున్నారు. వైసీపీ…
సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ సీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. నా ఇష్టం నా రాజ్యాంగ అన్నట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారం మోపుతున్నాయన్నారు.. మూడేళ్ల పాలనలో మద్యం రేట్లు మూడు వందల శాతం పెంచారంటూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.. ఇక, మంత్రివర్గ విస్తరణలో సత్య సాయి జిల్లాకు సీఎం వైఎస్ జగన్ అన్యాయం…
మంత్రి పదవులు దక్కలేదని అలకబూనిన నేతలంతా దారికొస్తున్నారు. సీఎం జగన్తో భేటీ అనంతరం.. అధినేతకు విధేయులుగా ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా అలక వీడారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారథి, కాపు రాచమంద్రారెడ్డి అసంతృప్తికి గురయిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల బుజ్జగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అలకబూనిన ఒక్కో నేత… అధినేత దారిలోకి వస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్రెడ్డి, పార్థసారథి,…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ అధికార పార్టీలోని అసంతృప్తులను బయటపెట్టింది.. కేబినెట్లో స్థానం కోల్పోయినవారిని, పదవి ఆశించి నిరాశ ఎదురై అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీ అధిష్టానం బుజ్జగించి.. మళ్లీ అందరినీ లైన్లోకి తీసుకొచ్చింది.. అయితే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే కూడా పదవి ఆశించారని.. మంత్రి పదవిరాకపోవడంతో అలకబూనారనే వార్తలు వచ్చాయి.. దీనిపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆర్కే.. నేను మంత్రి పదవి ఆశించలేదని స్పష్టం చేసిన ఆయన.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో…
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి తిరుగే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉండి, పాలకొల్లు తప్ప అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో వైసీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. సాక్షాత్తు వైసీపీ ఎంపీటీసీ చంపుతానని అదే పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెదిరిస్తున్నాడంటూ, ప్రాణ రక్షణ కావాలని నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. https://ntvtelugu.com/pinnelli-ramakrishna-reddy-meets-cm-jagan/ ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి ఎంపీటీసీ బజారయ్యను శ్రీరామనవమి రోజున…
మంత్రి పదవి రాలేదని ఏపీలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మంత్రి పదవి రాకపోవడంపై పిన్నెల్లిని బుజ్జగించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆయన మాట్లాడారు. మొదట్నుంచీ జగన్ కోసం, పార్టీకోసం పనిచేశాం. ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఒకసారి వైఎస్, మూడు సార్లు జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యే అయ్యా. సామాజిక…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్.. మరోసారి జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయలేని పవన్ కల్యాణ్… భీమ్లా నాయక్ కాదని తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చం అడుక్కునే బిచ్చ నాయక్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. Read Also: VH: మళ్లీ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసిన వీహెచ్.. చెప్పినా పట్టించుకోరా..? పవన్…