Bihar Civil Court Peon Exam: బీహార్లో దారుణం.. అభ్యర్థి ఫోటోకు బదులుగా కుక్క ఫోటో ముద్రించిన అడ్మిట్ కార్డులు..
- రితేష్ 2022 లో సివిల్ కోర్టులో ప్యూన్ పోస్టుకు దరఖాస్తు
- తాజాగా ఈ నియామక పరీక్షకు అడ్మిట్ కార్డులు జారీ
- అభ్యర్థి ఫోటోకు బదులుగా కుక్క ఫోటో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారుల నిర్లక్ష్యం ఓ నిరుద్యోగ అభ్యర్థిని చిక్కుల్లో పడేసింది. ప్యూన్ పోస్టు కోసం అప్లై చేసుకున్న అతనికి తీరా అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోగా తన ఫొటోకు బదులు కుక్క ఫొటో దర్శనమివ్వడంతో కంగుతిన్నాడు. బీహార్లోని రోహ్తాస్ లో ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అభ్యర్థి అడ్మిట్ కార్డులో అతని ఫోటోకు బదులుగా కుక్క ఫోటో ముద్రించారు. ఈ సంఘటన అభ్యర్థిని తీవ్ర కలతకు గురిచేసింది. ఇది మరోసారి నియామక ప్రక్రియ, ఆన్లైన్ దరఖాస్తు వ్యవస్థ గురించి ప్రశ్నలను లేవనెత్తింది. నివేదికల ప్రకారం, ఈ సంఘటన బిక్రమ్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ధావా గ్రామానికి చెందిన రితేష్ కుమార్ కు జరిగింది.
Also Read: Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
రితేష్ 2022 లో సివిల్ కోర్టులో ప్యూన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల నియామక ప్రక్రియ ఆలస్యం కాగా, తాజాగా ఈ నియామక పరీక్షకు అడ్మిట్ కార్డులు జారీ చేశారు. అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకున్న రితేష్ షాక్ అయ్యాడు. అడ్మిట్ కార్డులోని పేరు, ఇతర సమాచారం సరైనవే, కానీ తన ఫోటోకు బదులుగా, కుక్క చిత్రం ముద్రించి ఉండడంతో షాక్ తిన్నాడు.
Also Read:Monalisa: పెద్దలు ఒప్పుకోలేదు కాపాడండి.. కేరళ పోలీస్ స్టేషన్లో ప్రియుడితో మోనాలిసా
ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత రితేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుకు బోర్డునే కారణమని నిందించాడు. నేను ఈ విషయం గురించి సంబంధిత బోర్డు, విభాగానికి ఫిర్యాదు చేశాను. పరీక్ష రాయడంలో నాకు ఎటువంటి సమస్యలు రాకుండా ఈ తప్పును సరిదిద్దాలని కోరినట్లు తెలిపాడు. సివిల్ కోర్టులో ప్యూన్ పోస్టులకు రాత పరీక్ష మార్చి 15న జరగనుంది. రితేష్ సెంటర్ సహర్సాలో ఉంది. తన అడ్మిట్ కార్డులో ఉన్న ఈ తీవ్రమైన లోపం గురించి రితేష్ ఆందోళన చెందుతున్నాడు. సమయం మించిపోతోందని, ఈ లోపాన్ని వీలైనంత త్వరగా సరిదిద్దకపోతే, పరీక్ష రాయడంలో తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నాడు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!