MP Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఇవాళ ఎంపీ అవినాష్రెడ్డిని ప్రశ్నించింది సీబీఐ.. దాదాపు ఐదు గంటల పాటు అవినాష్ని విచారించింది సీబీఐ.. అయితే, సీబీఐ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ అవినాష్రెడ్డి హాట్ కామెంట్లు చేశారు.. వాస్తవాలు టార్గెట్గా కాకుండా.. వ్యక్తి టార్గెట్ గా విచారణ సాగుతోందని ఆరోపించారు.. సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా సాగాలని డిమాండ్ చేశారు.. ఈ కేసులోని వాస్తవాలపై…
Kodali Nani vs Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓపెన్ చాలెంజ్ విసిరారు.. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. గన్నవరంలో చంద్రబాబు పర్యటన, అక్కడ బాబు చేసిన కామెంట్లపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు కొడాలి నాని.. నేను, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వస్తాం.. కొట్టుకుందాం.. నువ్వు రెడీనా బాబు? అని సవాల్ చేశారు.. అసెంబ్లీకి రాజీనామా చేసి వస్తాం.. ఎక్కడైనా ముగ్గురం కలిసి కొట్టుకుందాం.. చత్తీస్గఢ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా?…
Kodali Nani: గన్నవరం పాలిటిక్స్ కాకరేపుతున్నాయి.. మాటల తూటాలు, దాడులు, కేసుల వరకు వెళ్లింది వ్యవహారం.. ఇక, ఇవాళ గన్నవరంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పోలీసులపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. ఇదే సమయంలో.. చంద్రబాబుకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా..? లేక బాలకృష్ణ పిచ్చి సినిమాలు చూసి పిచ్చెక్కిందా? అంటూ ఎద్దేవా…
పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రజలను నమ్మి పార్టీ పెట్టారని.. కానీ ఎన్టీఆర్పై కుట్ర చేసి, నిందలు వేసి చంద్రబాబుని సీఎం చేశారని ఆయన అన్నారు.
Off The Record: ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, గవర్నర్ కోటాతోపాటు స్థానిక సంస్థల కేటగిరిలో 18 సీట్లకు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించింది. 18లో ఏకంగా 14 సీట్లను SC, ST, BCలకే కేటాయించారు. అందులోనూ 11 స్థానాలను కేవలం BC సామాజికవర్గాలకే ఇచ్చారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం, స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉన్న పట్టు రీత్యా ఈ రెండు కోటాల్లోనూ అభ్యర్థుల గెలుపు లాంఛనమే. శాసనమండలికి ఇంత పెద్దఎత్తున బీసీలను పంపించటం…
Off The Record: డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం. తిరుపతిలోని రష్ ఆస్పత్రి అధినేత. తాజాగా ఆయన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. నిన్న మొన్నటి వరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు ఈ సిపాయి. ఈ మధ్యే టీడీపీ పదవికి.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏ పార్టీలోనూ సిపాయి చేరింది లేదు. ఇంతలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా…
MLC Election 2023: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నామినేషన్లకు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండటంతో…విశాఖ, కర్నూల్, చిత్తూరు, అనంతపురం , తూర్పు గోదావరి, కడప, శ్రీకాకుళం స్థానిక సంస్థల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ ముఖ్య నేతలతో ర్యాలీలుగా బయల్దేరి వెళ్లి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రులు…
Gannavaram Incident: గన్నవరం ఘటన కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది.. ఈ ఘటనపై రాజకీయం దుమారం రేగుతోంది.. వైసీపీ నేతపై టీడీపీ.. తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.. అయితే, అసలు గన్నవరంలో రెచ్చగొట్టింది ఎవరు? అని ప్రశ్నించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వాళ్లే అరాచకాలు సృష్టించి మా పార్టీని బాధ్యులను చేయాలనే కుట్ర జరుగుతోంది.. గన్నవరం కేంద్రంగా రెండు, మూడు రోజులుగా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి.. టీడీపీ ఆలోచనలోనే…