BCCI Naman Awards: లెజెండ్స్కు బీసీసీఐ సలాం! రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్లకు అత్యున్నత పురస్కారాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Naman Awards: భారత క్రికెట్ చరిత్రలో తమదైన ముద్ర వేసిన దిగ్గజాలకు బీసీసీఐ అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ ఫాస్ట్ బౌలర్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీలను ఈ ఏడాది ప్రతిష్టాత్మక కల్నల్ సి.కె.నాయుడు జీవిత సాఫల్య పురస్కారం (Life-time Achievement Award) వరించింది. అలాగే మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కు బీసీసీఐ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు.
READ ALSO: Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!
Also Read
దిగ్గజాల ప్రస్థానం ఇదే..
రాహుల్ ద్రవిడ్: అంతర్జాతీయ క్రికెట్లో 24,000 పరుగులు చేసిన ద్రవిడ్, భారత బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచారు. కోచ్గా అండర్-19 ప్రపంచ కప్ (2018), సీనియర్ పురుషుల జట్టుకు T20 ప్రపంచ కప్ (2024) అందించడంలో ఆయన పాత్ర చిరస్మరణీయం.
రోజర్ బిన్నీ: 1983 ప్రపంచ కప్ హీరోలలో ఒకరైన బిన్నీ, ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. 2022-25 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.
మిథాలీ రాజ్: మహిళా క్రికెట్లో 10,868 పరుగులు చేసిన మిథాలీ, భారతదేశంలో మహిళా క్రీడకు కొత్త దిశను చూపించారు.
స్టార్ ఆఫ్ ది ఇయర్ గా శుభ్మాన్ గిల్
2024-25 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన శుభ్మాన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పురుషుల విభాగం)గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనకు పాలీ ఉమ్రిగర్ ట్రోఫీని ప్రదానం చేయనున్నారు. మహిళల విభాగంలో స్మృతి మంధాన ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా అవార్డు అందుకోనున్నారు.
అవార్డుల జాబితా ..
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పురుషులు) : శుభ్మాన్ గిల్
ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు) : స్మృతి మంధాన
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు) : హర్షిత్ రాణా
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు) : శ్రీ చరణిరంజీ
రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్ రౌండర్ : హర్ దుబే
పరిమిత ఓవర్లలో ఉత్తమ ఆల్ రౌండర్ : ఆయుష్ మాత్రే
రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు (ఎలైట్) : యష్ రాథో
ర్రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు (ఎలైట్) : హర్ష్ దుబే
ఉత్తమ అంపైర్ : ఉల్హాస్ గాంధే
డొమెస్టిక్ క్రికెట్లో ముంబై హవాదేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్కు అవార్డు లభించింది. అలాగే వివిధ విభాగాలలో (కూచ్ బెహార్, విజయ్ మర్చంట్ ట్రోఫీ) రాణించిన యువ క్రీడాకారులకు జగ్మోహన్ దాల్మియా, ఎం.ఏ చిదంబరం ట్రోఫీలను అందజేయనున్నారు. ఈ వేడుకలో ఇటీవల ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను కూడా సత్కరించనున్నారు. అయితే ఈసారి విజేతల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పేర్లు లేకపోవడం గమనార్హం.
READ ALSO: Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!