Sri Rama Navami: మీ ఇంటికే భద్రాద్రి రామయ్య ముత్యాల తలంబ్రాలు.. ఇలా చేస్తే చాలు.!
- భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ముఖ్య తేదీలు
- శ్రీ సీతారాముల కళ్యాణం టికెట్ బుకింగ్ విధానం
- ఇంటికే భద్రాద్రి ముత్యాల తలంబ్రాలు ఎలా పొందాలి
- భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Rama Navami: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ప్రధానమైనది. “దక్షిణ అయోధ్య”గా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున నిర్వహించే ఈ వార్షిక కళ్యాణ వేడుకను కళ్లారా వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రామదాసు కీర్తనలతో మార్మోగే భద్రాద్రి గిరులు, గోదావరి నది తీరాన జరిగే ఈ అద్భుత ఘట్టం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఏడాది మార్చి 19న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 2 వరకు వైభవంగా సాగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఈసారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తుల కోసం టికెట్ బుకింగ్ , రాలేని భక్తుల కోసం ఇంటికే తలంబ్రాలను పంపే వినూత్న ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి.
Ira Bhaskar: ధురంధర్ ‘‘హిందుత్వ’’ సినిమా.. పాక్పై స్వర భాస్కర్ తల్లి ప్రేమ..
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
ఈ మహోత్సవంలో అత్యంత ముఖ్యమైన శ్రీ సీతారాముల వార్షిక కళ్యాణం మార్చి 27న జరగనుండగా, మరుసటి రోజు అనగా మార్చి 28న శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. భక్తులు ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ఆలయ అధికారులు ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భక్తులు భద్రాచలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ హోమ్ పేజీలోని “శ్రీరామనవమి టికెట్” లింక్పై క్లిక్ చేసి, తమకు నచ్చిన కళ్యాణం లేదా పట్టాభిషేకం సెక్టార్ను ఎంచుకుని నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ సదుపాయం లేని వారు మార్చి 15 నుంచి భద్రాచలం రామాలయ ప్రధాన కౌంటర్, తానీషా కళ్యాణ మండపం, గోదావరి బ్రిడ్జీ వద్ద ఉన్న దేవస్థానం విచారణ విభాగం లేదా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ద్వారా నేరుగా టికెట్లు పొందవచ్చు.
Hebba Patel: సైలెంటుగా మొదలెట్టిన హెబ్బా పటేల్!
దూర ప్రాంతాల్లో ఉండి భద్రాచలానికి రాలేని భక్తుల కోసం కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆన్లైన్ ద్వారా రూ. 5,000 లేదా రూ. 1,116 టికెట్లు బుక్ చేసుకుంటే, వారి గోత్ర నామాలతో ఆలయంలో కళ్యాణం నిర్వహిస్తారు. అంతేకాకుండా, స్వామివారి ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు TGSRTC లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక సేవలను అందిస్తోంది. రూ. 151 చెల్లించి సమీప ఆర్టీసీ కౌంటర్లలో లేదా ఆన్లైన్ ద్వారా తలంబ్రాలను బుక్ చేసుకుంటే, ఉత్సవాల అనంతరం వాటిని ఇంటికే డెలివరీ చేస్తారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు, 2 లక్షల చిన్న లడ్డూలు , 3 వేలకు పైగా మహా లడ్డూలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు (TGSRTC, APSRTC) వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చాయి.
తాజావార్తలు
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!