Sri Rama Navami: మీ ఇంటికే భద్రాద్రి రామయ్య ముత్యాల తలంబ్రాలు.. ఇలా చేస్తే చాలు.!
- భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ముఖ్య తేదీలు
- శ్రీ సీతారాముల కళ్యాణం టికెట్ బుకింగ్ విధానం
- ఇంటికే భద్రాద్రి ముత్యాల తలంబ్రాలు ఎలా పొందాలి
- భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Rama Navami: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ప్రధానమైనది. “దక్షిణ అయోధ్య”గా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున నిర్వహించే ఈ వార్షిక కళ్యాణ వేడుకను కళ్లారా వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రామదాసు కీర్తనలతో మార్మోగే భద్రాద్రి గిరులు, గోదావరి నది తీరాన జరిగే ఈ అద్భుత ఘట్టం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఏడాది మార్చి 19న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 2 వరకు వైభవంగా సాగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఈసారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తుల కోసం టికెట్ బుకింగ్ , రాలేని భక్తుల కోసం ఇంటికే తలంబ్రాలను పంపే వినూత్న ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి.
Ira Bhaskar: ధురంధర్ ‘‘హిందుత్వ’’ సినిమా.. పాక్పై స్వర భాస్కర్ తల్లి ప్రేమ..
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ఈ మహోత్సవంలో అత్యంత ముఖ్యమైన శ్రీ సీతారాముల వార్షిక కళ్యాణం మార్చి 27న జరగనుండగా, మరుసటి రోజు అనగా మార్చి 28న శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. భక్తులు ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ఆలయ అధికారులు ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భక్తులు భద్రాచలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ హోమ్ పేజీలోని “శ్రీరామనవమి టికెట్” లింక్పై క్లిక్ చేసి, తమకు నచ్చిన కళ్యాణం లేదా పట్టాభిషేకం సెక్టార్ను ఎంచుకుని నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ సదుపాయం లేని వారు మార్చి 15 నుంచి భద్రాచలం రామాలయ ప్రధాన కౌంటర్, తానీషా కళ్యాణ మండపం, గోదావరి బ్రిడ్జీ వద్ద ఉన్న దేవస్థానం విచారణ విభాగం లేదా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ద్వారా నేరుగా టికెట్లు పొందవచ్చు.
Hebba Patel: సైలెంటుగా మొదలెట్టిన హెబ్బా పటేల్!
దూర ప్రాంతాల్లో ఉండి భద్రాచలానికి రాలేని భక్తుల కోసం కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆన్లైన్ ద్వారా రూ. 5,000 లేదా రూ. 1,116 టికెట్లు బుక్ చేసుకుంటే, వారి గోత్ర నామాలతో ఆలయంలో కళ్యాణం నిర్వహిస్తారు. అంతేకాకుండా, స్వామివారి ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు TGSRTC లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక సేవలను అందిస్తోంది. రూ. 151 చెల్లించి సమీప ఆర్టీసీ కౌంటర్లలో లేదా ఆన్లైన్ ద్వారా తలంబ్రాలను బుక్ చేసుకుంటే, ఉత్సవాల అనంతరం వాటిని ఇంటికే డెలివరీ చేస్తారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు, 2 లక్షల చిన్న లడ్డూలు , 3 వేలకు పైగా మహా లడ్డూలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు (TGSRTC, APSRTC) వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చాయి.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?