వైసీపీ నుంచి బయటకు వచ్చిన నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై, సీఎం జగన్ పైన హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలి. పొట్టేపాలెం కలుజు నిర్మాణం చేయాలి. ఈ మార్గం మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు.వరదల సమయంలో ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. వంతెన నిర్మాణంతో పాటు రహదారుల కోసం రూ.27 కోట్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నా ..ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. రూరల్ పరిధిలో పలు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు కోటంరెడ్డి.
Read Also: Somireddy Chandramohan Reddy: మోడీజీ.. ఏపీలో నో డిజిటల్.. ఓన్లీ క్యాష్
శివారు కాలనీల్లో మౌలిక వసతులు. లేక ఇబ్బంది పడుతున్నారు. నిధులు ఇవ్వాలని కోరినా పట్టించుకోవడంలేదు. కొండ్లపూడి లిఫ్ట్ ఇర్రిగేషన్ పనులకు నిధులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్రర్ పనులు ఆపేశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రజల నుంచి స్థలం తీసుకుని పరిహారం ఇవ్వలేదు. బి.సి.భవన్..అంబేద్కర్ భవన్..కాపు భవన్ ల నిర్మాణాలు ఆగిపోయాయి.
జిల్లాలో మొదటి నుంచి జగన్ కు అండగా ఉన్నా. ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే నా ఫోన్ ను ట్యాపింగ్ లో పెట్టారు. అనుమానం ఉన్న చోట ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. చివరి టికెట్ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? అన్నారు. అందుకే ముందుగానే నిర్ణయం తీసుకున్నా. గతంలో 23 మంది వైసిపి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అప్పుడు కష్టకాలంలో ఉన్న జగన్ కు అండగా ఉన్నా. నామీద ఎన్ని కేసులు పెట్టినా భయపడను అన్నారు కోటంరెడ్డి. గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ పై తనదైన శైలిలో జగన్ పై పోరాటం చేస్తున్నారు కోటంరెడ్డి.
Read Also: Nalgonda love Story: ప్రేమదేశం సినిమా రిపీట్.. విషాదంగా క్లైమాక్స్