Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయాయని విమర్శించారు.
Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్నీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎంపికయ్యారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత. కర్నూలులో టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం.. జాతీయ ఎస్సీ కమిషన్ను కలిసింది.. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు వైసీపీ నేతలు.. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టులో దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, వంశీ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు .
Vizag MLC Election: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్య్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు.
అగ్రనేతల ఎఫైర్స్ వైసీపీకి తలపోటుగా మారుతున్నాయా? ఒకరు కాదు… ఇద్దరు కాదు… వరుసబెట్టి కీలక నేతలంతా ఎఫైర్స్ ఎపిసోడ్స్లో చిక్కుకోవడం పార్టీ కేడర్ని సైతం ఇరుకున పెడుతోందా? వీళ్ళ చేష్టలతో బయట తలెత్తుకోలేకపోతున్నామని కేడర్ తలలు పట్టుకుంటోందా? నాయకులంటే అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడం సహజం కానీ ఇక్కడ వస్తున్నవన్నీ పరువు తక్కువ విషయాలు కావడం అగ్ర నాయకత్వానికి కూడా చికాకుగా మారిందా? ఈ ఎపిసోడ్ లో ఎవర్ని ఏం అనాలో తెలియక వైసీపీ పెద్దలు సైలెంట్గా…
వైసీపీ పదవులకు రాజీనామా చేసిన ఆ నాయకుడిది వ్యూహమా? లేక వైరాగ్యమా? పార్టీలోనే కొనసాగుతూ…. జిల్లా అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేయడాన్ని ఎలా చూడాలి? పవర్లో లేని పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నారా? ఎవరా నాయకుడు? ఇలాంటి వ్యవహారాల్లో ఆయన గతం ఏం చెబుతోంది? ఏపీలో పొలిటికల్గా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏలూరు ఒకటి. ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్…
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ ఫైల్ చేశారు. ఆయన వెంట బొత్స ఝాన్సీ, ఎంపీ తనుజారాణి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టు భావించాలని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.